Tara Shahdeo: షూటర్ తారా సహదేవ్ కేసులో.. మాజీ భర్తకు జీవిత ఖైదు
Shooter Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ బలవంతపు మతమార్పిడి కేసులో ఆమె మాజీ భర్తకు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించింది.
రాంచీ: జాతీయ స్థాయి అథ్లెట్, షూటర్ తారా సహదేవ్ (Shooter Tara Shahdeo) బలవంతపు మతమార్పిడి (Forced Conversion)కి సంబంధించిన కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు (CBI Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమె మాజీ భర్తతో పాటు మరో ఇద్దర్ని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి తాజాగా శిక్ష ఖరారు చేసింది. ఆమె మాజీ భర్త రకీబ్ఉల్ హసన్ అలియాస్ రంజిత్ కోహ్లీకి జీవిత ఖైదు (Life Imprisonment) విధించింది. హసన్ తల్లి కౌసర్ రాణికి 10 ఏళ్లు, మరో నిందితుడు ముస్తాఖ్ అహ్మద్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
ఏంటీ కేసు..?
ఝార్ఖండ్కు చెందిన తారా సహదేవ్ జాతీయ స్థాయి షూటర్గా రాణిస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం రంజిత్ కోహ్లీ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారి.. 2014 జులైలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే తారాకు సంచలన విషయాలు తెలిశాయి. తన భర్త అసలు పేరు రకీబ్ఉల్ హసన్ అని తెలిసింది. అదే సమయంలో తారా మతం మార్చుకోవాలని రకీబ్ఉల్ ఆమెపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె 2014 ఆగస్టులో తన భర్త, అత్తపై కేసు పెట్టింది.
మనీశ్ సిసోదియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలెక్కడ..?: దర్యాప్తు సంస్థలకు సుప్రీం ప్రశ్న
రకీబ్ఉల్ తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకునేందుకు అంగీకరించకపోవడంతో తనను శారీరకంగా హింసించారని ఆరోపించింది. ఝార్ఖండ్ హైకోర్టులో అప్పటి విజిలెన్స్ రిజిస్ట్రార్గా ఉన్న ముస్తాఖ్ అహ్మద్.. తన అత్తింటి వారికి సహకరించాడని తారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఝార్ఖండ్ హైకోర్టు.. 2015లో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
దీంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో రకీబ్ఉల్ హసన్, అతడి తల్లి కౌసర్ రాణి, మరో నిందితుడు ముస్తాఖ్ అహ్మద్ను సీబీఐ ప్రత్యేక కోర్టు గతవారం దోషులుగా తేల్చింది. తాజాగా వీరికి శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉండగా.. 2018లో రాంచీలోని ఫ్యామిలీ కోర్టు తారాకు విడాకులు మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..