AN 94 Rifle: రష్యా ఆయుధం పంజాబ్కు ఎలా వచ్చింది..?
ప్రముఖ గాయకుడు సిద్ధూమూసేవాల హత్య ఇప్పుడు పంజాబ్లో గుబులు పుట్టిస్తోంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి కారులో బయటకు వచ్చిన మూసేవాలాపై ప్రత్యర్థులు తూటాల వర్షం కురిపించారు. క్షణాల వ్యవధిలో దాదాపు 30 తూటాలు పేల్చారు.
సిద్ధూ మూసేవాల హత్యలో గుబులు పుట్టిస్తోన్న రైఫిల్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రముఖ గాయకుడు సిద్ధూమూసేవాల హత్య ఇప్పుడు పంజాబ్లో గుబులు పుట్టిస్తోంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి కారులో బయటకు వచ్చిన మూసేవాలాపై ప్రత్యర్థులు తూటాల వర్షం కురిపించారు. క్షణాల వ్యవధిలో దాదాపు 30 తూటాలు పేల్చారు. ఘటనా స్థలంలో లభించిన తూటాలు పరిశీలించాక షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. తొలుత ఈ హత్యకు ఏకే-47 రైఫిల్ వాడినట్లు భావించారు. కానీ, అక్కడ దొరికిన ఖాళీ తూటాలను పరిశీలించి.. రష్యాకు చెందిన ఏఎన్-94 రైపిల్ను వాడినట్లు తేల్చారు. పంజాబ్లో ఈ రైఫిల్ లభించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ రష్యా రైఫిల్ను భారత్లో వినియోగించరు. దీనిని కేవలం రష్యా సాయుధ బలగాలు మాత్రమే వినియోగిస్తాయి. ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ అనే వేర్పాటువాద దళం వద్ద కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్లో ఈ రైఫిల్ ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.
హంతకులు తొలుత సిద్ధూ మూసేవాలా ఇంటి సమీపంలోకి వెళ్లగా.. అక్కడ ఏకే-47 రైఫిల్స్తో గార్డులు కనిపించారు. దీంతో వారు కెనడాలోని గోల్డీబ్రార్ అనే గ్యాంగ్స్టర్ సాయంతో ఏఎన్-94 రైఫిల్ను సంపాదించి హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఏమిటీ ఏఎన్-94 రైఫిల్..?
ఏఎన్-94 రష్యాలో తయారయ్యే రైఫిల్. ఏఎన్ అంటే అవోటోమాట్ నికొనోవ్ అని అర్థం. ఈ రైఫిల్కు చీఫ్ డిజైనర్ గెన్నాడి నికొనోవ్ పేరు వచ్చేలా పెట్టారు. నికనోవ్ మెషిన్గన్ను కూడా డిజైన్ చేసింది ఆయనే. ఏఎన్-94 డిజైన్పై 1980లో పనిచేయడం మొదలుపెట్టి.. 1994లో పూర్తి చేశారు. ఆయన పేరిట పలు పేటెంట్లు ఉన్నాయి.
* రష్యాలో ఏకే-74 రైఫిల్ను భర్తీ చేసేందుకు ఏఎన్-94ను అభివృద్ధి చేశారు. కానీ, ఖరీదు ఎక్కువగా ఉండటం, సంక్లిష్టమైన డిజైన్ కావడంతో పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రష్యా సైన్యం కొన్ని అవసరాల కోసం ఏఎన్-94ను వాడుతోంది.
* ఈ రైఫిల్ టూరౌండ్ బరస్ట్ మోడ్లో నిమిషానికి 600 రౌండ్లను పేల్చగలదు. అదే ఆటోమేటిక్ మోడ్లో నిమిషానికి 1,800 తూటాలు దూసుకొస్తాయి. దీని తూటా సెకన్కు 900 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 700 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదే ఏకే-47 తూటా సెకన్కు 715 మీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ రైఫిల్కు జీపీ-30 గ్రనేడ్ లాంఛర్ను కూడా అమర్చవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.