Rahul Gandhi: చైనాపై భారత్కు సరైన వ్యూహం లేదు : రాహుల్
చైనాను ఎదుర్కొనే విషయంలో సరైన వ్యూహం లేని కారణంగా జాతీయ భద్రత విషయంలో భారత్ క్షమించరాని విధంగా రాజీ పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడుతోందన్న కాంగ్రెస్ నేత
దిల్లీ: చైనాను ఎదుర్కొనే విషయంలో సరైన వ్యూహం లేని కారణంగా జాతీయ భద్రత విషయంలో భారత్ క్షమించరాని విధంగా రాజీ పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా చైనా సరిహద్దు అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) విరుద్ధ ప్రకటనలు చేయాడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా ఆక్రమణలపై అమెరికా రక్షణశాఖ నివేదికపై మీడియాలో వచ్చిన కథనాలను రాహుల్ ప్రస్తావించారు.
‘జాతీయ భద్రతపై భారత ప్రభుత్వం రాజీ పడుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద ఎటువంటి వ్యూహం లేదు. చైనాకు Mr 56 (56 అంగుళాల ఛాతి) భయపడుతున్నారు’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ట్విటర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అవాస్తవాలు చెబుతున్న నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులను కంటికిరెప్పలా కాపాడుతోన్న సైనికులకు సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇక భారత భూభాగంలోకి చైనా అక్రమంగా ప్రవేశించి కొత్త గ్రామాన్ని నిర్మిస్తోందని అమెరికా రక్షణశాఖ నివేదికలోని అంశాలు అవాస్తవమని భారత త్రివిద దళాధిపతి (CDS) జనరల్ బిపిన్ రావత్ ఈ మధ్యే స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి వెలసిన గ్రామం ఇటీవలి కాలంలో నిర్మించినది కాదని.. అలాంటి గ్రామాలన్నీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పరిధిలోనే నిర్మించుకున్నారని జనరల్ బిపిన్ రావత్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో అమెరికా నివేదికపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాలశాఖ.. భారత్ భూభాగంలో చైనా ఆక్రమణలను గానీ, ఆ దేశ అసంబద్ధమైన వాదనలను గానీ ఎన్నడూ ఆమోదించలేదని స్పష్టం చేసింది. ‘దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాలతో పాటు సరిహద్దుల్లో చైనా కొన్నేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టింది. అయితే ఆ దేశ ఆక్రమణలను, వాదనలను భారత్ ఎప్పుడూ ఆమోదించలేదు’ అని పేర్కొంది. దేశ భద్రతపై ప్రభావం చూపే పరిణామాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని.. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని విదేశాంగ శాఖ ఉద్ఘాటించింది.
అయితే, ఇలా చైనా ఆక్రమణలపై వచ్చిన నివేదికలపై భారత త్రిదళాధిపతి, విదేశాంగశాఖ భిన్న ప్రకటనలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక వ్యూహం లేకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. -
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. -
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. -
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..? -
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు