Acharya: రొమాంటిక్‌ పాటతో..

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.

Published : 24 May 2021 18:44 IST

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘‘లాహే లాహే’’ గీతాన్ని విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ సినిమా నుంచి మరో గీతం విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే ఓ రొమాంటిక్‌ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ పాట చిరుపై చిత్రీకరించినదా? లేక చరణ్‌ పాత్రకు సంబంధించినదా? అన్నది తెలియాల్సి ఉంది.

త్వరలోనే పాట విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 15రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. కొవిడ్‌ పరిస్థితులు కుదుట పడగానే చిత్రీకరణ మొదలు కానుంది. ఇందులో చిరు సరసన కాజల్‌ నటిస్తుండగా.. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే ఆడిపాడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని