Anupama: ‘డీజే టిల్లు 2’లో అనుపమే ఫిక్స్‌.. ప్రత్యామ్నాయ వృత్తి అంటూ పోస్ట్‌!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డీజే టిల్లు’. ఈ సినిమా సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమ పరమేశ్వరనే కథానాయిక అని స్పష్టమైంది.

Published : 11 Jan 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయం అందుకున్న చిత్రం ‘డీజే టిల్లు’ (DJ Tillu). ఈ సినిమాకి కొనసాగింపుగా ‘టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square) ని తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం అదే ఏడాది దీపావళి కానుకగా ప్రకటించింది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) నటిస్తుందని వెల్లడించింది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనుపమ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని వదంతలు వచ్చాయి. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వెనక్కి వచ్చేసిందని, ఆ స్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందని.. ఇలా పలు రకాల ఊహాగానాలు పలు వెబ్‌ సైట్లు, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఎక్కడా స్పందించని అనుపమ తాజా పోస్ట్‌తో స్పష్టతనిచ్చింది.

ఆ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన ఆమె హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) జుత్తుకు జెల్‌ (క్రీమ్‌) రాస్తూ కనిపించింది. ‘ఇది నా ప్రత్యామ్నాయ వృత్తి’ అంటూ సంబంధిత వీడియోను అనుపమషేర్‌ చేసింది. ‘డిజే టిల్లు’కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్‌ను రామ్‌ మల్లిక్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తొలి భాగంలోని హీరో పాత్ర టిల్లు, హీరోయిన్‌ పాత్ర రాధిక (నేహాశెట్టి నటించింది) యువతను కట్టిపడేశాయి. దాంతో, ఈ సినిమా ప్రకటన రాగానే ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని