Bhagyasri: ఇంకా చేయాల్సింది చాలా ఉంది!
‘‘ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. హిందీలోనూ.. దక్షిణాది సినిమాల గురించే మాట్లాడుకుంటారు. ఇలాంటి దశలో నేను తెలుగులో నటించడం సంతృప్తినిచ్చింది. తల్లిగానే కాదు... నటనకి
‘‘ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. హిందీలోనూ.. దక్షిణాది సినిమాల గురించే మాట్లాడుకుంటారు. ఇలాంటి దశలో నేను తెలుగులో నటించడం సంతృప్తినిచ్చింది. తల్లిగానే కాదు... నటనకి ప్రాధాన్యమున్న ఎలాంటి పాత్రలకైనా నేను సిద్ధమేన’’ని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. కథానాయికగా... అందాల తారగా భారతీయ ప్రేక్షకులపై తనదైన ముద్రవేసిన నటి భాగ్యశ్రీ. ‘ప్రేమపావురాలు’తో తెలుగు ప్రేక్షకులకీ చేరువైంది. ‘యువరత్న రాణా’, ‘ఓంకారం’ సినిమాలతోనూ ఆమె తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. రెండు దశాబ్దాల విరామం తర్వాత ఆమె రెండో ఇన్నింగ్స్ని మొదలుపెట్టింది. ‘తలైవి’, ‘రాధేశ్యామ్’ చిత్రాల్లో తల్లిపాత్రల్ని పోషించింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ పంచుకున్న విషయాలివీ...
‘‘కుటుంబ ప్రాధాన్యాలతో బిజీగా ఉండటంతోనే ఇన్నాళ్లూ నటనకి దూరమయ్యా. నా భర్తకి నేనంటే ప్రాణం. అందమైన నా భార్య నా ఇంట్లోనే ఉండాలనుకున్నారు. ఇప్పుడు మా పిల్లలు, భర్త సినిమాల్లో నటించమని ప్రోత్సహిస్తున్నారు. అందుకే రెండో ఇన్నింగ్స్ని మొదలుపెట్టా. ‘మైనే ప్యార్ కియా’ తర్వాత కూడా నేను కొన్ని సినిమాలు చేశా. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటే కుటుంబ బంధాలు బాగుంటాయని భావించి బిజీగా ఉన్నా అప్పట్లో పెళ్లిపీటలెక్కా. ఇప్పుడు కుటుంబం ప్రోత్సాహంతో మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ నటిగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నా. రెండో ఇన్నింగ్స్ సంతృప్తికరంగా సాగుతోంది’’.
‘‘తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ ఇక్కడికి రావడం చాలా నచ్చింది. నటిగా నేను చేసింది కొన్ని పాత్రలే. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముఖ్యంగా యువతరంతో కలిసి పనిచేయాలనేది నా లక్ష్యం. ఇదివరకటితో పోలిస్తే సినిమా చాలా మారింది. ఓటీటీ మాధ్యమాల వల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నటిగా నేను కన్న మరిన్ని కలలు నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నా’’.
* ‘‘నేను మళ్లీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు వచ్చిన సినిమాలు... ‘తలైవి’, ‘రాధేశ్యామ్’. రెండింటిలోనూ తల్లిగా బలమైన పాత్రలే. ఈ రెండు చిత్రాలూ ఒకేసారి మొదలైనా... కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది.
* ప్రభాస్కి తల్లిగా నటించడం మంచి అనుభవం. ఇందులో నేను కనిపించే విధానం, నా హెయిర్స్టైల్ అన్నీ కొత్తగా ఉంటాయి.
* ప్రభాస్తో కలిసి నటిస్తున్నప్పుడు సెట్లో ఎప్పుడూ కుటుంబ వాతావరణమే కనిపించేది. రుచికరమైన భోజనాన్ని సెట్స్కి తీసుకొచ్చేవాడు ప్రభాస్. అందరం కలిసి కూర్చుని తినేవాళ్లం. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కానీ నేనో పెద్ద స్టార్ని అనే గర్వం లేకుండా మెలగడం చూసి ఆశ్చర్యపోయా ’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి