Ponniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా గురించి ఐశ్వర్య ఏమన్నారంటే...!

మణిరత్నం కలల సినిమాగా రానున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వం’. ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. పెద్దపెద్ద నగరాల్లో ఈవెంట్‌లను ఏర్పాటు చేస్తుంది.

Published : 25 Sep 2022 14:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ‘పొన్నియిన్‌ సెల్వం’. ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇక ఈ సినిమాలో ‘నందిని’ పాత్రలో నటించిన  అందాల తార ఐశ్వర్య రాయ్‌.. ముంబయిలో జరిగిన ప్రమోషనల్‌ ఈవెంట్‌లో మణిరత్నంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మణిరత్నం నాకు గురువు. నా మొదటి సినిమా ఆయన దర్శకత్వంలోనే నటించాను. ఒక నటిగా నా ప్రయాణం ఆయన దర్శకత్వంతో మొదలైనందుకు నేను అదృష్టవంతురాలిని.  ఆయన ఉత్తమ గురువు’’.

‘‘అప్పట్లో తిరువర్‌, గురు, రావణ్‌, ఇప్పుడు పొన్నియిన్‌ సెల్వన్‌.. ఇలా మంచి సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. ఇక ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో భాగమవ్వడం ఏ కళాకారుడికైనా కలే. అలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు మనమంతా అదృష్టవంతులం. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పని చేశారు’’ అని మణిరత్నంపై తనకున్న గౌరవాన్ని తెలిపారు.

ఇక తన కూతురు ఆరాధ్య గురించి మాట్లాడుతూ..‘’ ఆరాధ్య అభిషేక్‌తో కలిసి పొన్నియిన్‌ మూవీ సెట్స్‌కు వచ్చింది.  బాగా ఎంజాయ్‌ చేసింది. ఆమె మణిరత్నాన్ని చాలా గౌరవిస్తుంది. మణిరత్నం ఒక రోజు ఆమెకు ‘యాక్షన్‌’ చెప్పే అవకాశాన్ని కల్పించారు. ఆరోజు తన ఆనందానికి అవధులు లేవు. ఆమె జీవితంలో అది మర్చిపోలేని తీపి జ్ఞాపకం’’ అంటూ ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని