raid2: మరోసారి ‘రైడ్‌’ చేయడానికి..!

అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైడ్‌’. 2018లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Updated : 07 Jan 2024 09:35 IST

జయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైడ్‌’. 2018లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 1981లో సర్దార్‌ ఇందర్‌ సింగ్‌ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన రైడ్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘ఈ దేశ పేదరికానికి కారణం పేదలు కాదు.. వారి దగ్గర దోచుకునే ధనవంతులు’ అని ‘రైడ్‌’లో అజయ్‌ యాక్షన్‌ హంగామా ఆకట్టుకుంది. పనోరమ స్టూడియోస్‌, టీ-సిరీస్‌ సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. నవంబరు 15న సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ‘‘రైడ్‌ 2’ కోసం ఐఆర్‌ఎస్‌ అధికారి అమయ్‌ పట్నాయక్‌గా అజయ్‌ దేవగణ్‌ తిరిగి రంగంలోకి దిగనున్నారు. మరో అతిపెద్ద కేసును నవంబరు 15న తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. సస్పెన్స్‌ కథనంతో, థ్రిల్లింగ్‌ అంశాలతో  ఈ చిత్రం అలరించనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని