Alia Bhatt: అలియాకు అవార్డు.. స్పీచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించి..

ప్రముఖ నటి అలియా భట్‌ జాయ్‌ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 21 Jan 2024 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి అలియా భట్‌ (Alia Bhatt)కు జాయ్‌ పురస్కారం (Joy Awards) వరించింది. సౌదీ అరేబియా రియాద్‌లో జరిగిన జాయ్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘ఆనరరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేకర్స్‌ అవార్డు’ అందుకున్నారు. రెడ్‌, బ్లూ కలర్‌ కాంబినేషన్‌ చీర ధరించిన అలియా అందరి దృష్టిని ఆకర్షించారు. సంబంధిత ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

షకీలాపై పెంపుడు కుమార్తె దాడి.. పోలీసులను ఆశ్రయించిన నటి

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎప్పటికీ మరిచిపోలేని క్షణమిది. ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలే నా ప్రపంచమని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పా. ‘లైట్స్‌, కెమెరా, యాక్షన్‌’ల మధ్యనే నేను జన్మించానని భావిస్తున్నా. తారతమ్యాలు లేకుండా ప్రతిభావంతులందరినీ సత్కరిస్తున్న జాయ్‌ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ఈ అవార్డుతోపాటు వేదిక అందించిన జ్ఞాపకాలు, సినిమాపై మరింత ప్రేమతో ఇంటికి తిరిగి వెళ్తా. సినిమాలే మనందరినీ ఒకే తాటిపై నడిపిస్తున్నాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా పాల్గొన్నారు.

గతేడాది ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’, ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రాలతో అలరించిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వాసన్‌ బాల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని