Alitho Saradaga: పాత్ర నచ్చితే మళ్లీ విలన్గా చేస్తా: గోపీచంద్
హీరో మెటీరియల్కి సరితూగే కొలతలున్న నటుడు గోపీచంద్ (Gopichand). మాస్, యాక్షన్, కామెడీ ఇలా ఒక్కటేమిటి అన్ని అంశాల్లోనూ హీరోగా తనదైన ముద్ర వేశారు. అందుకే అభిమానులు ఆయన్ని ‘మాచో స్టార్’...
నాలో అప్పటి నటుడిని మళ్లీ చూస్తారు..!
హీరో మెటీరియల్కి సరితూగే కొలతలున్న నటుడు గోపీచంద్ (Gopichand). మాస్, యాక్షన్, కామెడీ.. ఇలా ఒక్కటేమిటి అన్ని అంశాల్లోనూ హీరోగా తనదైన ముద్ర వేశారు. అందుకే అభిమానులు ఆయన్ని ‘మాచో స్టార్’ అని పిలుచుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) జులై1న విడుదల కానున్న సందర్భంగా ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆయనతో పాటు దర్శకుడు మారుతి (Maruthi) కూడా ఇందులో పాల్గొని ‘పక్కా కమర్షియల్’ చిత్ర విశేషాలు తెలియజేశారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
మీరు రష్యాలో చదివారట? ఎన్ని సంవత్సరాలు ఉన్నారక్కడ?
గోపీచంద్: అప్పుడు మనకు తెలిసిన వాళ్లంతా అక్కడే చదువుతున్నారు. అందుకే నేనూ రష్యా వెళ్లాను. అయిదు సంవత్సరాలు ఉన్నాను. ఇంజినీరింగ్ అక్కడే పూర్తి చేశాను.
మీ కోసమే మీ నాన్నగారు(టి. కృష్ణ) ఒక స్కూల్ కట్టించారట?దాని కథేంటి?
గోపీచంద్: అవును.. మాది ఒంగోలు పక్కనున్న చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు అన్నయ్యని, నన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి దగ్గర్లో పాఠశాలలు లేక ఆయనే మంచి స్కూల్ పెడదామనే ఉద్దేశంతో ప్రారంభించారు. అక్కడ నేను మూడో తరగతి వరకు చదివాను. ఆ తరువాత మా ఫ్యామిలీ చెన్నైకి మారింది. ‘టి.కృష్ణ మెమోరియల్ స్కూల్’ పేరుతో ఇప్పటికీ ఆ స్కూల్ రన్ అవుతోంది. ప్రతీ సంవత్సరం ఆ స్కూల్ని సందర్శిస్తుంటాం.
అసలు మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
గోపీచంద్: నిర్మాత నాగేశ్వరరావు గారే కారణం. ‘నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నాను’ అన్నప్పుడు బాబాయి పోకూరి బాబూరావు(ఈతరం ఫిలింస్) ‘ఎందుకురా! ఇండస్ట్రీకి’ అన్నారు. దర్శకులుగా ఉన్నప్పుడే నాన్నగారు, అన్నయ్య చనిపోవటంతో ఒక విధమైన విముఖత. కానీ ‘నేను సినిమాల్లో చేస్తాను’ అనడంతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య నా ఆసక్తి గమనించి ‘తొలివలపు’ (Tholivalapu) తీశారు. అదే నా మొదటి సినిమా. దానికి నాగేశ్వరరావు గారే నిర్మాత.
‘నాన్నగారు నా సక్సెస్ చూసుంటే బాగుండేద’ని మీకనిపిస్తుందా?
గోపీచంద్: అనిపిస్తుంది.. హీరోగా నా సక్సెస్ని చూసుంటే నాన్నగారు, అన్నయ్య చాలా ఆనందపడేవారు. దురదృష్టవశాత్తు వారిద్దరూ లేరు.
ఆరడుగుల కటౌట్ మీది.. ప్రేమ సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో?
గోపీచంద్: ఇండస్ట్రీలో అటువంటివేం లేవు(నవ్వుతూ). వచ్చామా.. మన పని మనం చేశామా.. అంతే. కానీ, కాలేజ్ డేస్లో చిన్న లవ్ స్టోరీ ఉంది. అందంగా ఉందని రష్యన్ అమ్మాయికి ప్రపోజ్ చేశా. ఆ అమ్మాయి మనిద్దరి దేశాలు వేరని రిజెక్ట్ చేసింది. ఓకే అని లైట్ తీసుకున్నా(నవ్వుతూ)
‘రణం, యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, సౌఖ్యం’ ఈ టైటిళ్ల వెనక సీక్రెట్ ఏంటి?
గోపీచంద్: సీక్రెట్ ఏం లేదు. అలా కుదిరిందంతే. నాకు ఎటువంటి సెంటిమెంట్లు లేవు. కానీ, ‘సౌఖ్యం’ (Soukhyam) సినిమాకి మాత్రం సరదాగా ఓ చర్చ నడిచింది. నేనొద్దన్నా, ఆ టైటిల్ కావాలనే వాటికి కలిసేలా పెట్టారు.
హీరోగా ప్రారంభించి, విలన్గా సక్సెస్ అయ్యి మళ్లీ హీరోగా నిలిచారు... ఈ ప్రయాణం ఎలా?
గోపీచంద్: ‘తొలివలపు’ (Tholivalapu) సినిమా ఫెయిలయ్యాక, అవకాశాలు ఏం లేక ఆరునెలలు ఖాళీగా ఉన్నాను. ఆలోచనలో పడ్డా. ఈ రూటు మనకు కరెక్టేనా అని. నేనంతకు ముందే కలిసిన దర్శకుడు తేజ ఒక రోజు సాయంత్రం ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మని పిలిచారు. ‘జయం’(Jayam) స్టోరీలోని చిన్న సీన్ చెప్పారు. వెంటనే చేస్తానని చెప్పా. తరువాతి రోజు నుంచే షూటింగ్ ప్రారంభించారు. ‘జయం’ సక్సెస్ తరువాత వరుసగా విలన్ రోల్స్ చేశాను. అవి నన్ను మాస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేశాయి. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాను.
ఇప్పుడు హీరోగా మంచి స్థాయిలో ఉన్నారు. మళ్లీ విలన్గా ఏమైనా చేస్తారా?
గోపీచంద్: చేస్తాను. కథ, రోల్ నాకు నచ్చాలి. నేను విలన్గా చేసిన పాత్రలన్నీ హీరోలకి దీటుగా ఉండేవే. ఆ వైవిధ్యం ఉంటేనే చేస్తాను.
మొదటి సక్సెస్ ‘యజ్ఞం’ ఎలా వచ్చింది?
గోపీచంద్: ఆ స్టోరీకి నన్ను ఎంపిక చేయడం ఆశ్చర్యంగానే జరిగింది. మొదట ‘యజ్ఞం’(yagnam) ప్రభాస్ దగ్గరికి వెళ్లింది. కొత్త డైరెక్టర్ అని రిజెక్ట్ చేశారు. తరువాత కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లింది. అక్కడా అదే జవాబు. ఆ తరువాత బాబాయి పోకూరి బాబూరావు నన్ను పిలిచి నువ్వు చేస్తావా అని అడిగారు. ఒప్పుకున్నాను. అప్పటికి ‘వర్షం’, ‘నిజం’ షూటింగ్స్ జరుగుతున్నాయి.
‘ఒక్కడు’లో విలన్ పాత్ర మీ దగ్గరికి వచ్చిందట?
గోపీచంద్: అవును. అప్పటికే ఆ పాత్రకు ప్రకాశ్రాజ్ని సంప్రదించారు. ఆయనకు డేట్స్ కుదరకపోవటంతో దర్శకుడు గుణశేఖర్ ఓబుల్ రెడ్డి పాత్ర గురించి నాకు చెప్పారు. నాకు ఆసక్తిగా అనిపించి చేస్తానని చెప్పాను. ఆ తరువాత ప్రకాశ్రాజ్కి డేట్లు సర్దుబాటు కావడంతో ఆయనే చేసేశారు.
జనరల్గా నెగెటివ్ సెన్స్లో వాడతాం ‘పక్కా కమర్షియల్’ అనే పదాన్ని.. అసలు ఈ చిత్రం ఎలా ఉంటుంది?
గోపీచంద్: చాలా వినోదభరితంగా ఉంటుంది. ఇది నా దగ్గరికెప్పుడో రావాల్సిన కథ. ‘రణం’, ‘లౌక్యం’ తరువాత నేను ఫుల్ టైం కామెడీ చేసిన చిత్రం ఇదే. ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) చిత్రంలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి.
మారుతి: ప్రస్తుతం ప్రేక్షకులు జడ్జిమెంట్ చాలా వేగంగా ఇస్తున్నారు. వాళ్ల వేగానికి తగినట్లు మనం సినిమా పాయింట్ను చెప్పగలగాలి. అందులో భాగంగానే మేము ముందే ‘పక్కా కమర్షియల్’ అని చెప్పేశాం.
మీరిద్దరూ ఈ సినిమా వర్క్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా?
గోపీచంద్: చాలా సరదాగా సాగిపోయింది. అందరం బాగా ఎంజాయ్ చేశాం. అంతే ఉత్సాహంగా సినిమాలోనూ నటించాం.
మారుతి: నిజానికి గోపిచంద్ అన్నతో ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది. ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. సీన్లలో నటించేటప్పుడు ఆశ్చర్యం కలిగేది ఆయనలోని నటుడిని చూసి. బయట ఉండే క్యాజువల్ గోపిచంద్ని మీరు ‘పక్కా కమర్షియల్’లో చూడబోతున్నారు.
ఇండస్ట్రీలో దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది?
మారుతి: పట్టుదల ద్వారానే.. ఒకసారి ఒక డైరెక్టర్ నన్ను ‘నువ్వు డైరెక్టర్ అయితే తెలుస్తుంది.. నువ్వు తియ్ తక్కువ బడ్జెట్లో ఇలాంటి సినిమా’ అన్నారు. నేను వెంటనే ‘ఈ రోజుల్లో’ తీసి చూపించాను. ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి ఆయన్ని పిలిచాను. యాభై లక్షలతో తీసిన సినిమా అది.
‘పక్కా కమర్షియల్’కి మీరు దర్శకుడా? నిర్మాత?
మారుతి: నా ప్రతి సినిమాకి నేనే నిర్మాతగా వ్యవహరిస్తాను. దర్శకుడిగా నన్ను నేను పరిశీలించుకోవడానికి, ఎటువంటి అభద్రతాభావానికి గురవ్వకుండా ఉండటానికి నా సినిమాలని నేనే పర్యవేక్షించుకుంటాను.
‘పక్కా కమర్షియల్’ చిత్రంపై చివరిగా ప్రేక్షకులకు మీరు చెప్పేదేంటి?
మారుతి: గోపీచంద్-మారుతి కాంబినేషన్ చాలా చక్కగా కుదిరింది. జులై1న విడుదలవుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా. మీరంతా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని హామీ ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్