Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం

‘పుష్ప’తో జాతీయ అవార్డు అందుకున్న నటుడు అల్లు అర్జున్‌ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

Published : 15 Feb 2024 23:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే జర్మనీకి పయనమయ్యారు. ఆ దేశ రాజధాని బెర్లిన్‌లో ఫిబ్రవరి 15న మొదలైన ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 25 వరకు జరగనుంది (74th Berlin International Film Festival). ఆ వేదికపై ‘పుష్ప’ సినిమాని ప్రదర్శించనున్నారు.

‘పుష్ప’ సినిమాతో అర్జున్‌ విశేష క్రేజ్‌ సంపాదించుకోవడంతోపాటు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ నుంచి ఈ పురస్కారం దక్కించుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు. ఆ సినిమా సీక్వెల్‌ ‘పుష్ప 2’తో ఇప్పుడు బిజీగా ఉన్నారు. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇది పూర్తయిన తర్వాత అర్జున్‌.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకు ముందు ఈ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని