Allu Arjun: చెప్పు వదిలేసినా వైరలవ్వడం మొదటిసారి చూశా: శ్రీవల్లీ పాటపై అమితాబ్‌ కామెంట్స్‌

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇందులోని శ్రీ వల్లీ పాటపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌బచ్చన్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Updated : 08 Nov 2023 11:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో విడుదలైన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. ఈ చిత్రంలోని శ్రీవల్లీ పాట గురించి బాలీవుడ్‌ స్టార్ హీరో అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) తాజాగా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

అమితాబ్‌ ఎన్నో ఏళ్లుగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని 15వ సీజన్‌ ప్రసారమవుతోంది. దీని తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ శ్రీవల్లీ పాటలో అల్లు అర్జున్‌ స్టెప్‌ గురించి కామెంట్స్ చేశారు. ‘‘పుష్ప’ నిజంగా అద్భుతమైన సినిమా. అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించింది. చెప్పు వదిలేసినా..  వైరల్‌ కావడం నా జీవితంలో మొదటిసారి చూశాను. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారు. ప్రతి ఒక్కరూ వారి చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునే వారు’’ అని నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ కామెంట్స్‌ను బన్నీ ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.

రష్మికలా.. మరో హీరోయిన్‌ డీప్‌ఫేక్‌ ఫొటో!

ఇక ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప2’ (Pushpa2) తెరకెక్కుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని