Anni Manchi Sakunamule: హాయినిచ్చే ఓ మంచి జ్ఞాపకం.. ‘అన్నీ మంచి శకునములే’
‘‘లెక్కలు వేసుకుని చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమాని మాత్రం ప్యాషన్తోనే తీయాలి’’ అంటున్నారు యువ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్. అగ్ర నిర్మాత అశ్వినీదత్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ ఇద్దరూ గుర్తుండిపోయే సినిమాల్ని నిర్మిస్తూ, విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు.
‘‘లెక్కలు వేసుకుని చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమాని మాత్రం ప్యాషన్తోనే తీయాలి’’ అంటున్నారు యువ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్. అగ్ర నిర్మాత అశ్వినీదత్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ ఇద్దరూ గుర్తుండిపోయే సినిమాల్ని నిర్మిస్తూ, విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు. మిత్రవిందా మూవీస్తో కలిసి స్వప్న సినిమా పతాకంపై ఇటీవల ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) నిర్మించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘అన్నీ మంచి శకునములే’ ఎలా ఉంటుంది?
స్వప్న: మితిమీరిన వాణిజ్యాంశాలు, మలుపుల్లాంటివేవీ ఇందులో ఉండవు. వేసవిలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ పది రోజులు గడిపి వస్తే ఆ జ్ఞాపకాలు ఎలాంటి హాయిని పంచుతాయో అలాంటి చిత్రమిది. విక్టోరియాపురం అనే ఓ చిన్న టౌన్ని సృష్టించి ఆ నేపథ్యంలో ఈ సినిమాని తీసింది నందిని. హీరో హీరోయిన్ల కథ అనడం కంటే, ఇది రెండు కుటుంబాల కథ అని చెప్పాలి.
ప్రియాంక: ఈ సినిమా అంతా కున్నూర్ హిల్ స్టేషన్లోని ఓ ఇంటి నేపథ్యంలో జరుగుతుంది. చిన్నప్పుడు సెలవుల్లో నాన్నతోపాటు ఊటీలాంటి ప్రదేశాలకి వెళ్లేవాళ్లం. ఎప్పటి నుంచో ఆ నేపథ్యంలో ఓ కుటుంబ కథ చేయాలని ఉండేది. నందిని చెప్పిన ఈ కథతో ఆ కోరిక నెరవేరింది.
ఒకవైపు ప్రభాస్తో ‘ప్రాజెక్ట్ కె’, మరోవైపు పరిమిత వ్యయంతో కూడిన ఈ సినిమా చేయడానికి కారణమేమిటి? బహు భాషల్లో విడుదలే లక్ష్యంగా నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారా?
స్వప్న: ఒక మంచి కథ అనుకున్నప్పుడు... దాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు సినిమా చిన్నదా, పెద్దదా అనేది పట్టింపు ఉండదు. మా జీవితం మలుపు తీసుకుందే ‘ఎవడే సుబ్రమణ్యం?’ నుంచి. మా జీవితంలో అది పెద్ద సినిమా. మంచి కథ అనుకుని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. మాకు సహజంగా మూడు నాలుగు సినిమాలు ఒకేసారి తీయడానికి ఇష్టం ఉండదు. ప్రతి సినిమాకీ ఎంతో కొంత లీనమై చేయడం మా శైలి. కానీ ఈసారి మూడు సినిమాలు ఒకేసారి చేయాల్సి వచ్చింది. దానికి కరోనా తదనంతర పరిణామాలే కారణం.
ప్రియాంక: కథకి, పాత్రలకి ఎవరు బాగుంటారో వాళ్లనే ఎంపిక చేసుకున్నాం. అంతే కానీ... వీళ్లైతే తమిళంలో సినిమాకి మేలు జరుగుతుంది, వీళ్లైతే మలయాళంకి బాగుంటుందని నటుల్ని ఎంపిక చేసుకోలేదు. ఒకవేళ తర్వాత డబ్ అయితే, అక్కడ మాకు ఈ నటులు బలం అవుతారేమో తెలియదు కానీ... ముందుగా మాత్రం పాత్రలకి తగ్గట్టుగానే నటుల్ని ఎంపిక చేసుకున్నాం. గౌతమి, ఊర్వశి, వాసుకి... వీళ్లంతా ఆయా పాత్రలకి తగ్గట్టు పక్కాగా కుదిరారు. కథానాయకుడు సంతోష్ శోభన్ అరుదైన నటుడు. ఇందులో రిషి పాత్ర విన్నప్పుడే మాకు సంతోష్ శోభన్ గుర్తొచ్చాడు. చాలా బాగా నటించాడు. ఈ సినిమాతో తన కెరీర్ మారుతుందనే నమ్మకం ఉంది.
కథల ఎంపికలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరు ఎలాంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటారు?
స్వప్న: ఒకొక్కరూ ఒక్కో కథని బలంగా నమ్ముతుంటాం. నిర్ణయాలు మాత్రం అందరూ కలిసే తీసుకుంటాం. ‘జాతిరత్నాలు’ సినిమాని నాగ్ అశ్విన్, ప్రియాంక నమ్మినంతగా నేను నమ్మలేదు. తొలి రోజు సినిమా చూస్తూ అందరూ నవ్వుకుంటున్నప్పుడు కూడా నాలో ఒక రకమైన సందేహమే. ఆ సినిమా కోవిడ్ సమయంలో విడుదలైంది. విడుదలకి ముందు కూడా ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. బ్రహ్మాండమైన ఆఫర్ ఇది.. అమ్మేద్దాం అని నేనంటే... నాగ్ అశ్విన్ ‘మనకు వయసు ఉంది, డబ్బు తర్వాతైనా సంపాదించుకోవచ్చు. ఈ సినిమాకి పోతే అంతా పోతుంది, లేదంటే బ్లాక్బస్టర్ అవుతుంది. థియేటర్లలో విడుదల చేద్దాం’ అని చెప్పాడు. ‘సీతారామం’ సినిమాని వాళ్లిద్దరి కంటే నేను ఎక్కువగా నమ్మాను. ఇక ‘మహానటి’ సినిమానైతే మేమందరం ఓ బాధ్యతగా చేశాం. తక్కువ సినిమాలే చేస్తాం. చేస్తున్న ప్రతిదీ మా హృదయానికి దగ్గరగా ఉండాలనుకుంటాం. ఇప్పటిదాకా మాకు నచ్చింది, మేం ముచ్చటపడి చేసిన ప్రతిదీ విజయాన్ని ఇచ్చింది. 80 శాతం ప్రేక్షకుల అభిరుచి మాకు ఉందని నమ్ముతున్నాం. పూర్తిస్థాయి కమర్షియల్ మీటర్ మాకు తెలియదు కానీ, విభిన్నంగా మంచి అనుభూతిని పంచే కథల్ని ఎంపిక చేసుకుంటున్నాం.
ప్రియాంక: మేం అందరం అన్ని బాధ్యతల్నీ నిర్వర్తిస్తాం. సెట్కి వెళతాం, నిర్మాణానంతర కార్యక్రమాలు, మార్కెటింగ్ వ్యవహారాలు... ఇలా అన్నీ చూసుకుంటాం. సెట్కి వెళ్లి మేం అక్కడ కూర్చుంటేనే చిత్రీకరణ సాగుతుందని కాదు... ఏదైనా జరిగితే వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు కదా.
స్వప్న: మొదటి సినిమాకి మేం ఒకరినొకరు కొట్టుకున్నాం. తర్వాత కూర్చుని ఓ నిర్ణయానికొచ్చాం. తను కొన్ని పనులు చేస్తుంది, నేను కొన్ని చేస్తాను. తను చేస్తున్నప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే నన్ను అడుగుతుంది. నాకేమైనా అవసరమైతే తనని అడుగుతాను. ఒకరు ఆఫీస్లో ఉంటే, మరొకరం సెట్లో ఉంటాం. కథలు, నటుల విషయంలో నాన్న సలహాలూ తీసుకుంటుంటాం.
‘ప్రాజెక్ట్ కె’ సంగతులేమిటి? తదుపరి కొత్త సినిమాల కబుర్లేమిటి?
స్వప్న: ‘ప్రాజెక్ట్ కె’కి అన్నీ మంచి శకునములే (నవ్వుతూ). ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అన్ని వివరాలూ చెబుతాం.
ప్రియాంక: శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా ‘ఛాంపియన్’ అనే సినిమా చేస్తున్నాం. అదొక్కటే కొత్తచిత్రం. మా దృష్టంతా భారీ చిత్రమైన ‘ప్రాజెక్ట్ కె’పైనే ఉంది. తర్వాతే మిగతా సినిమాల గురించి ఆలోచిస్తాం.
ఇందులో నా పాత్ర స్వప్నదత్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని కథానాయిక మాళవిక నాయర్ చెప్పారు. మీరేమంటారు?
స్వప్న: తను అలా చెప్పిందా? తన పాత్ర ఇందులో చాలా కమర్షియల్. జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. నేను కూడా ఆచితూచి వ్యాపారం చేస్తుంటాను. ఇవన్నీ మంచి గుణాలే అయితే నేను తనలాగే ఉంటానేమో.
ప్రియాంక: నందిని, స్వప్న పది, పన్నెండేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కలిసి ఎప్పట్నుంచో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రభావంతో నందిని ఆ పాత్రని రాసిందేమో చెప్పలేం (నవ్వుతూ).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ది గోట్’.. అప్డేట్ షేర్ చేసిన దర్శకుడు
విజయ్ ‘ది గోట్’పై దర్శకుడు వెంకట్ ప్రభు అప్డేట్ ఇచ్చారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక
డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది. -
పేరు అదేనా?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న సినిమాపై ఈ నెల 20న మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజైన ఆ రోజున చిత్రబృందం అధికారికంగా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కానీ... పేరుని కానీ వెల్లడించే అవకాశాలున్నాయి. -
సూర్యకు జోడీగా పూజ?
సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ తొలి వారం నుంచి అండమాన్ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. -
‘ధురంధర్’.. గ్యాంగ్స్టర్
సంగ్రామ్ భలేరావ్గా ‘సింగమ్ అగైన్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. రణ్వీర్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. -
ప్రేమ యుద్ధానికి సన్నాహాలు
‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా ఆకట్టుకున్నారు బాలీవుడ్ యువజంట రణ్బీర్ కపూర్, అలియా భట్. ఇప్పుడు మరోసారి ‘లవ్ అండ్ వార్’ సినిమాతో అభిమానులను ప్రేమలో పడేయడానికి ముస్తాబవుతోందీ జంట. -
అందర్నీ అలరించే యాక్షన్ చిత్రమిది
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. జి.ఎస్.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మనం’ ప్రత్యేక ప్రదర్శనలు
మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన సినిమాగా... ఏఎన్నార్ చివరి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ‘మనం’. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి. -
‘కన్నప్ప’లో కాజల్
విష్ణు మంచు కలల చిత్రం ‘కన్నప్ప’కి మరో ఆకర్షణ తోడైంది. ప్రముఖ కథానాయిక కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ దర్శకురాలి చిత్రంలో జాకీ ష్రాఫ్
ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్.. ఇప్పుడు ఓ సరికొత్త సినిమా కోసం అంతర్జాతీయ దర్శకురాలితో చేతులు కలిపారు. నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్ బొన్నైర్ తెరకెక్కిస్తున్న ‘స్లో జో’ అనే చిత్రంలో జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్.
తాజా వార్తలు (Latest News)
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్