NTR: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
నందమూరి తారకరామారావు (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని కైత్లాపూర్ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్.. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, డి.రాజా, సినీ ప్రముఖులు వెంకటేశ్, జయప్రద, జయసుధ, మురళీ మోహన్, రామ్ చరణ్, బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్కుమార్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ వంటి పలువురు సినీ తారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ మన అందరి అభిమాన నటుడు. ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతిచోట ఆయన శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. నటనలో ఆయనకి ఆయనే సాటి. అప్పట్లో అందరూ నన్ను ఎన్టీఆర్ తమ్ముడిగా పిలిచేవారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పుడైనా కేంద్రం ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని కోరుతున్నాను’’ అని తెలిపారు.
🔴 ‘‘ఎన్టీఆర్తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాను. క్రమశిక్షణ ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఎన్టీఆర్ ఆఖరిచిత్రంలోనూ నటించడం ఓ గొప్ప అనుభూతి’’ - జయసుధ
🔴 నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఒక మూలస్తంభం. ఆయన అందం, క్రమ శిక్షణ, వాక్చాతుర్యం గురించి అందరికీ తెలుసు. రాముడు, కృష్ణుడు అంటే నాకు గుర్తుకువచ్చేది ఆయనే. ఎన్టీఆర్ గురించి తాతయ్య గౌరవంగా మాట్లాడేవారు. వాళ్ల స్నేహం గురించి విని నేను స్ఫూర్తి పొందాను. తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కళకు, భాషకు ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.
🔴 ‘‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘మిస్సమ్మ’. ఆ సినిమా చూసి నటుడిని కావాలనుకున్నా. ఈరోజు ఆయన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ సినిమాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఆయనకు ఉన్న కోట్ల మంది భక్తుల్లో నేనూ ఒకడిని’’ - అడివి శేష్
🔴 ‘‘ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు చేసిన సేవ గురించి మాట్లాడాలి అంటే అర్హత ఉండాలి. శత జయంతి వేడుకల్లో ఆ మహనీయుడిని తలచుకునే అదృష్టం రావడం గొప్ప విషయం. భౌతికంగా మన మధ్యలేక పోయినా ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. నాది తెలుగు భాష అని చెప్పినప్పుడు ఉండే గర్వం పేరే ఎన్టీఆర్. ఒక జాతి కథే ఆయన చరిత్ర. ఆయనతో నటించలేకపోవడం బాధాకరం’’ - వెంకటేశ్
🔴 ‘‘రాముడు, కృష్ణుడి గురించి మాట్లాడలేము.. వారిని అనుభూతి చెందాలి. తెలుగుకి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఒకే ఒక్కసారి ఎన్టీఆర్ని కలిశాను. ఆయనే నాకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డించారు. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ఉంటుంది. తెలుగు వారి పవర్ ఇప్పుడు కాదు అప్పట్లోనే ప్రపంచానికి చాటారు’’ - రామ్ చరణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.