Dhanush: కమెడియన్‌కు ఆర్థిక సాయం చేసిన హీరోలు..

చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేర్లు హీరో ధనుష్‌‌, విజయ్ సేతుపతి. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరోలు అనిపించుకున్నారు. కష్టంలో ఉన్నానంటూ ఓ కమెడియన్‌ వీడియో పెట్టగా వీళ్లిద్దరూ అతనికి సాయం చేశారు.

Published : 25 Sep 2022 17:43 IST

 

చెన్నై: హీరోలు ధనుష్‌‌, విజయ్ సేతుపతి. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరోలు అనిపించుకున్నారు. కష్టంలో ఉన్నానంటూ ఓ కమెడియన్‌ వీడియో పెట్టగా వీళ్లిద్దరూ అతనికి సాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు.  ప్రస్తుతం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పనిచేయక ప్రాణాలతో పోరాడుతున్న అతనికి ధనుష్‌‌ లక్ష రూపాయలు సాయం చేశారు.  దీనిపై సదరు కమెడియన్‌ కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. గతంలో విజయ్‌ సేతుపతి కూడా ఇలానే తనకు సాయం చేశారని చెప్పారు.

ప్రస్తుతం ధనుష్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్ కథానాయిక ధనుష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. 1930-1940 ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ డ్రామాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని