హంగామా చేద్దామా అంటున్న రాజ్‌తరుణ్‌

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు. కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. హెబ్బా పటేల్‌, మాళవికా నాయర్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నుంచి ‘‘సరిగమ’’ అనే లిరికల్‌

Updated : 07 Dec 2022 19:32 IST

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు. కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. హెబ్బా పటేల్‌, మాళవికా నాయర్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నుంచి ‘‘సరిగమ’’ అనే లిరికల్‌ గీతాన్ని ఆవిష్కరించారు.

‘‘సరిగమ గమ గమ గామా.. హంగామా చేద్దామా’’ అంటూ సాగిపోయే గీతానికి రాజ్‌ తరుణ్‌, హెబ్బా వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చి స్వయంగా ఆలపించారు. వనమాలి చక్కటి సాహిత్యాన్ని అందించారు. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని