లైవ్‌-యాక్షన్‌లో ఛోటా భీమ్‌

‘ఛోటా భీమ్‌’...దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్‌ టెలివిజన్‌ షోలలో ఒకటి. ఆ ఫ్రాంచైజీ తన 15వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా మేకర్స్‌ ‘ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దామ్యాన్‌’ అనే లైవ్‌-యాక్షన్‌ సినిమాను ప్రకటించారు.

Published : 14 Sep 2023 00:55 IST

ఛోటా భీమ్‌’...దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్‌ టెలివిజన్‌ షోలలో ఒకటి. ఆ ఫ్రాంచైజీ తన 15వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా మేకర్స్‌ ‘ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దామ్యాన్‌’ అనే లైవ్‌-యాక్షన్‌ సినిమాను ప్రకటించారు. బుధవారం ఆ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనుపమ్‌ ఖేర్‌, మకరంద్‌ దేశ్‌పాండే కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని సినీ వర్గాలు తెలిపాయి. భీమ్‌ వెయ్యేళ్లు వెనక్కి వెళ్లే కథాంశంతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. భీమ్‌ చెడుతో పోరాడటానికి, వారిని అంతం చేయటానికి గురు శంభు, అతని బృందం సహాయం తీసుకుంటాడు. భీమ్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, నేపథ్య సంగీతం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురు శంభుగా అనుపమ్‌ ఖేర్‌, స్కంది పాత్రలో మకరంద్‌ దేశ్‌పాండే, ఆష్రియ మిశ్రా.. చుట్కీగా అలరించనున్నారు. 2012లో ఇదే పేరుతో ఒక యానిమేషన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన రాజీవ్‌ చిలక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్‌ వచ్చే ఏడాది మేలో తన అభిమానులకు హాయ్‌ చెప్పనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని