అదే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్..!
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మరో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు సూపర్స్టార్ మహేశ్బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ నేపథ్యంలో మహేశ్ను ఆయన కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె...
మహేశ్ను ఇంటర్వ్యూ చేసిన సితార, ఆద్యా
ఇంటర్నెట్ డెస్క్: ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మరో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు సూపర్స్టార్ మహేశ్బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ నేపథ్యంలో మహేశ్ను ఆయన కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యా మహేశ్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివే..
‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా ఓ స్పెషల్ కార్డ్ను సితార, ఆద్యా తయారు చేసి మహేశ్కు గిఫ్ట్గా అందించారు. గిఫ్ట్ చూసిన మహేశ్ చాలా సంతోషించి.. ‘ఈ కార్డ్ను నేను ఫ్రేమ్ కట్టించి స్టడీ రూమ్లో పెట్టుకుంటాను’ అని తెలిపారు.
సితార: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం ఎలా ఉంది?
మహేశ్: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఆర్మీ వాళ్లు లేకపోతే మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండేవాళ్లం కాదు.
ఆద్యా: ఆ పాత్రను పోషించడం ఛాలెంజ్గా అనిపించిందా?
మహేశ్: మేజర్ అజయ్ కృష్ణ పాత్రను పోషించడం ఛాలెంజ్గా అనిపించలేదు. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్లో చిత్రీకరించాం. ఆ సమయంలో కొంతమంది ఆర్మీ వాళ్లతో మాట్లాడాను. ఈ షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మహేశ్: కశ్మీర్ షూటింగ్కి నువ్వు కూడా వచ్చావ్ కదా. అక్కడ మనం సితార పుట్టినరోజును సెలబ్రేట్ చేశాం. మరి నీ అనుభవం ఎలా ఉంది?
ఆద్యా: చాలా అద్భుతంగా ఉంది
సితార: బాంబ్ పేలగానే జాతీయ పతాకం రంగులు రావడం.. ఎలా అనిపించింది?
మహేశ్: ఆ ఐడియా మా డైరెక్టర్ది. అది మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్లో చేశాం. (మధ్యలో సితార అందుకుని అది చూసి అందరూ వావ్ అన్నారు. వెంటనే మహేశ్.. నన్ను కొంచెం మాట్లాడని.. (నవ్వులు))
సితార: ఈ సినిమా మొత్తంలో ట్రైన్ సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంటుంది. మరి షూటింగ్ సమయంలో ఎలా అనిపించింది?
మహేశ్: ఆ ట్రైన్ సీక్వెన్స్ షూటింగ్ చాలా ఫన్నీగా సాగింది. ట్రైన్ సీక్వెన్స్లోని ప్రతి సీన్ షూట్ అవ్వగానే మేమద్దరం బాగా నవ్వుకునే వాళ్లం. అది చాలా గ్రేట్ టైమ్.
ఆద్యా: ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేశారా..?
మహేశ్: ఆ.. చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ట్రైన్ జర్నీ చేశాను. మా డైరెక్టర్ అనిల్రావిపూడికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఫ్లైట్స్ అంటే ఇష్టముండదు.
ఆద్యా: ఈ సినిమాలో మీకు నచ్చిన పంచ్ డైలాగ్..?
మహేశ్: ‘మీరందరూ నేను కాపాడుకునే ప్రాణాలు’ ఆ డైలాగ్ అంటే నాకు బాగా ఇష్టం
మహేశ్: మరి నీ ఫేవరెట్ డైలాగ్ ఏది?
ఆద్యా: మియావ్ మియావ్ పిల్లి.. మిల్క్ బాయ్తో పెళ్లి (నవ్వులు)
సితార: లుంగీలో డ్యాన్స్ చేయడం ఎలా ఉంది?
మహేశ్: బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత నేను లుంగీలో డ్యాన్స్ చేస్తూ కనిపించాను. (మధ్యలో ఆద్యా అందుకుని ఈసారి మీరు లుంగీలో చాలా స్పెషల్గా కనిపించారు)
ఫేవరెట్ సీన్: ఇంటర్వెల్ సీన్
ఫేవరెట్ కలర్: వైట్
ఫేవరెట్ సాంగ్: మైండ్ బ్లాక్
ఫేవరెట్ ఫుడ్: ఏదైనా
అభిమానుల కోసం ఒక మాట: ఐ లవ్ దెమ్
ఈ నెలలో మీకు జరిగిన ఓ గొప్ప విషయం: జనవరి 11, సరిలేరు నీకెవ్వరు రిలీజ్. ఎప్పటికీ గుర్తుండే రోజు
ఫేవరెట్ కోస్టార్: చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం రష్మిక
ఇప్పటివరకూ మీరు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ: సరిలేరు నీకెవ్వరు
ఇప్పటివరకూ మీకు వచ్చిన గొప్ప ప్రశంస: మా నాన్న నుంచి వచ్చింది. ఈ సినిమా చూశాక.. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలకంటే ఇందులో నా నటన చాలా బాగుందని చెప్పారు. అదే నాకు వచ్చిన గొప్ప ప్రశంస.
మహేశ్: ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది?
సితార: మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్.
మహేశ్: నన్ను ఇంటర్వ్యూ చేయడం ఎలా ఉంది?
సితార: అద్భుతం
ఆద్యా: ముందు కొంచెం భయం వేసింది. కానీ ఇప్పుడు ఓకే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం