స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌.. రష్మి కౌంటర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌ పెట్టిన పోస్ట్‌పై బుల్లితెర వ్యాఖ్యాత రష్మి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. కరోనా కల్లోలాన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌...

Published : 11 Apr 2020 18:06 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌ పెట్టిన పోస్ట్‌పై బుల్లితెర వ్యాఖ్యాత రష్మి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. కరోనా కల్లోలాన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్‌ కపూర్‌.. ఇంట్లో చాక్లెట్‌ కేక్‌ను తయారుచేశానని.. అయితే కేక్‌ తయారుచేసే సమయానికి తన ఇంట్లో చాక్లెట్స్‌ అయిపోయాయని కాకపోతే ఫార్చ్యూన్‌ గార్మెంట్‌ ఇండియా సంస్థ వారు తాను అడిగిన వెంటనే తనికి చాక్లెట్‌ పంపించారని తెలియచేస్తూ తన సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

ఇదిలాఉండగా సోనమ్‌కపూర్‌ పెట్టిన పోస్ట్‌పై బుల్లితెర వ్యాఖ్యాత రష్మి స్పందించారు. ‘ఫార్చ్యూన్‌ గార్మెంట్‌ ఇండియా.. మీరు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కేక్‌ బేకింగ్‌కు కావాల్సిన పదార్థాలను అందించడం అంత ముఖ్యమా? ఆమెకు చాక్లెట్‌ను అందించే క్రమంలో మీరు మీ ఉద్యోగుల జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు.’ అని రష్మి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని