దూరంగా ఉండి జ్యూసులివ్వడం బాధగా ఉంది!
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇటీవల
హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులతో మాట్లాడిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా విధుల్లో ఉన్న పోలీసులను నేరుగా కలిసి, వారికి ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చారు. పోలీసులకు ధైర్యం ఇచ్చేందుకు తన వంతు కృషిగా ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘‘ ప్రపంచంలోని 90శాతానికి పైగా దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండేవారని విన్నాను. ఇది కూడా ఒక యుద్ధమే. మనందరం కలిసి పోరాడుతున్నాం. దీన్ని తేలికగా తీసుకోవద్దు. ఈ యుద్ధంలో వైద్యులు, పోలీసులు, ప్రభుత్వం ముందుండి పోరాడుతోంది. ఈ విషయంలో మనం వాళ్లకు సంపూర్ణ మద్దతివ్వాలి. నేను బయటకు వచ్చి మాట్లాడటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే పబ్లిక్లో వచ్చి మాట్లాడితే బాగుంటుందని చాలా మంది పోలీసులు సూచించారు. దీంతో పాటు, ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు చెప్పేందుకు నేను పబ్లిక్లోకి వచ్చా. నేను వస్తుంటే మా అమ్మానాన్న బయటకు వద్దని చెప్పారు. కానీ, వాళ్లతో గొడవపడి పోలీసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చా. నేను ఒక్కరోజు వస్తేనే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. అలాంటిది, మీరు మీ కుటుంబాలను వదలి బయట విధులు నిర్వహిస్తున్నారు. మీకూ, వైద్య సిబ్బంది కుటుంబాలకు కృతజ్ఞతలు చెబుతున్నా. మే 3వ తేదీ వరకూ మీరు మరింత జాగ్రత్తగా పనిచేయాలని కోరుకుంటున్నా’’
‘‘పోలీసులు వారి విధులు చక్కగా నిర్వహిస్తారు. కానీ, మనం కూడా మన బాధ్యతలు నెరవేర్చాలి. పోలీసు సోదరులకు దూరం నుంచి ఫ్రూట్ జ్యూస్ ఇస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ, తప్పడం లేదు. ఇక్కడకు వచ్చిన వారందరికీ నాతో ఫొటో దిగాలని ఉంది. కానీ, ఏం చేయలేం. మనందరం ఇంట్లో ఉండాలని పీఎంగారు, సీఎంగారు, కమిషనర్గారు అందరూ చెబుతున్నారు. కానీ, ఇంకొందరు చెబితే వింటారనే ఉద్దేశంతో నన్ను పిలిపించారు. వాళ్లకు మనం సహకరించాలి. ఇంట్లో ఉండి ఏం చేయాలి? అనుకోవద్దు. క్షేమంగా ఉంటే చాలు. ఇప్పుడు లాక్డౌన్కు ఎంత సపోర్ట్ చేస్తే, అంత త్వరగా మనం ఈ పరిస్థితుల నుంచి బయట పడతాం. తొలుత లాక్డౌన్15రోజులు అన్నారు. కానీ, పరిస్థితులు మారిపోయాయి. లాక్డౌన్ పెరిగింది. కొందరు వ్యక్తులు ఏమీ కాదులే అని బయటకు వస్తున్నారు. అలా చేస్తే, లాక్డౌన్ ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎవరి ఇంట్లో వాళ్లు పోలీసులా ఉండాలి. పిల్లలకు బైక్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులను కోరుతున్నా. కుల,మత భేదాలు లేకుండా కరోనా అందరికీ సోకుతుంది. దయ చేసి మీకు కరోనా లక్షణాలు ఉన్నాయనిపిస్తే హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్చేయండి. మే 3వ తేదీ వరకూ అందరూ ఇళ్లలోనే ఉంటే, కరోనా బాధ నుంచి మనం తప్పించుకోవచ్చు.’’ అని ప్రజలను కోరారు
సీపీ అంజన్కుమార్ మాట్లాడుతూ.. ‘గత నాలుగైదు రోజులుగా పోలీసుల్లో మరింత స్ఫూర్తినింపేందుకు విజయ్ దేవరకొండ పనిచేస్తున్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. మేము అడగ్గానే వచ్చేందుకు వెంటనే ఒప్పుకొన్నారు. మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో 65 పోలీస్స్టేషన్లలోని పోలీసులతో విజయ్ ముచ్చటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యరంగానికి చెందిన వారు, పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 10వేలమంది పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. తమని తాము రక్షించుకుంటూనే విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి కానిస్టేబుల్కు మాత్రమే కాదు, అతని కుటుంబానికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నా. వారిలో స్ఫూర్తినింపేందుకు విజయ్గారు మరికొన్ని రోజులు మాతో ఉండాలని కోరుతున్నా’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!