ప్రభుదేవా, నయన్‌ కలిసి నటించడం లేదు..!

నృత్యదర్శకుడు, నటుడు ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో నటించడం లేదని నిర్మాత ఈశ్వరీ కె.గణేశ్‌ తెలిపారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘కరుప్పు రాజా వెలై రాజా’...

Published : 04 Jun 2020 12:39 IST

నిర్మాత క్లారిటీ

చెన్నై: నృత్యదర్శకుడు ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో నటించడం లేదని నిర్మాత ఈశ్వరీ కె.గణేశ్‌ తెలిపారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మాతగా ‘కరుప్పు రాజా వెలై రాజా’ అనే చిత్రం  కొన్నేళ్ల కిందట మొదలైంది. విశాల్‌, కార్తీ ప్రధాన పాత్రల్లో కొంత షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల రెండేళ్ల క్రితం నిలిచిపోయింది. అయితే, తాజాగా ఇది తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుందంటూ వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి. అంతేకాకుండా త్వరలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలిసి నటించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఈశ్వరీ సదరు వార్తలపై స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు.

‘‘కరుప్పు రాజా వెలై రాజా’ చిత్రంలో ప్రభుదేవా-నయన్‌ కలిసి నటిస్తున్నారని వస్తోన్న వార్తలు అవాస్తవం. ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్‌ ప్రధాన పాత్రల్లో నేను నిర్మించాలనుకున్న సినిమా కొన్ని సంవత్సరాల క్రితమే వాయిదా పడింది. ఇప్పుడు ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశం నాకు లేదు’ అని ఈశ్వరీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని