గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి

ప్రముఖ కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా (39) కన్నుమూశారు. గుండెపోటుతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి....

Updated : 07 Jun 2020 17:30 IST

బెంగళూరు: ప్రముఖ కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా (39) కన్నుమూశారు. గుండెపోటుతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నటుడ్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

చిరంజీవి సర్జాకు ప్రముఖ నటుడు అర్జున్‌ అంకుల్ అవుతారు. ఆయన 2009లో నటుడిగా కెరీర్‌ ఆరంభించారు. అనేక సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించి, యాక్షన్‌ హీరోగా గుర్తింపు పొందారు. 2020లో చిరంజీవి సర్జా నటించిన ‘సింగా’, ‘ఖాకీ’, ‘ఆద్యా’, ‘శివార్జున’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన చేతిలో ఇప్పుడు ‘రాజమార్థాండా’, ‘ఏప్రిల్‌’, ‘రణం’, ‘క్షత్రేయ’ సినిమాలు ఉన్నాయి. ఓ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుండగా.. మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.

2018 మే 2న చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని, రెండేళ్లు పూర్తయిందని 2020 మే 2న మేఘనా రాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. ఆమె తెలుగులో ‘బెండు అప్పారావు’, ‘లక్కీ’ చిత్రాల్లో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని