GopiChand: ఆగస్టులో.. ‘ఆరడుగుల బుల్లెట్‌’ 

గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. నయనతార కథానాయిక.

Published : 04 Jul 2021 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. నయనతార కథానాయిక. ఎప్పుడో విడుదలకావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదాపడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. గోపీచంద్‌- నయనతార జోడీ, బి. గోపాల్‌ దర్శకత్వం, మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం’ అని చిత్ర బృందం తెలిపింది. విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రాన్ని జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ పతాకంపై తాండ్ర రమేశ్‌ నిర్మించారు. ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: బాల మురగన్‌,కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని