టాలీవుడ్కు సీఎం కేసీఆర్ హామీలు
కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ మేనిఫెస్టోలో టాలీవుడ్కు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా.. 1. రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందిస్తామని చెప్పారు.
హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్కు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా..
1. రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందించడం.
2. థియేటర్ల యాజమాన్యం రోజూవారి ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడం.
3. సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం.
4. థియేటర్లకు కనీస విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని తెరాస ప్రకటించింది.
వీటితో పాటు థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీపెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం అన్నారు.
సీఎం కేసీఆర్ను పలువురు సినీ ప్రముఖులు ఈ నెల 22న (ఆదివారం) మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు. కరోనా దెబ్బతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూసిన టాలీవుడ్ను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెరాస విడుదల చేసే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలనను ప్రస్తావిస్తామని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్కు కృతజ్ఞతలు...
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మద్దతుగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసీఆర్ నిర్ణయాలు ఈ కష్ట సమయంలో చిత్ర పరిశ్రమకు, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పడుతుంది. కేసీఆర్ నేతృత్వంలో ఆయన విజన్కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి, దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతామన్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని చిరు పేర్కొన్నారు. మరో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కూడా కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చిత్ర పరిశ్రమ అధిగమించాలంటే ఈ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్ను రామ్చరణ్ రీట్వీట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. థియేటర్లు రీ-ఓపెనింగ్కు జీవో ఇవ్వడంతో పాటు సినీ పరిశ్రమలకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
రేవ్ పార్టీ విషయంలో తనపై వచ్చిన రూమార్స్పై జానీ మాస్టర్ స్పందించారు. -
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ పెట్టారు. -
మరోసారి ఆ తమిళ దర్శకుడితో చిరు సినిమా!
స్టార్ హీరో చిరంజీవి అప్కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
‘మిరాయ్’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్. ఈ సినిమాలోని ఆయన లుక్ విడుదలైంది. -
రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు.. తప్పుడు కథనాలను నమ్మొద్దు: శ్రీకాంత్
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.
-
ఆనంద్ దేవరకొండ ఫన్ అండ్ యాక్షన్.. ‘గం గం గణేశా’ ట్రైలర్ చూశారా!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా