Selfiee: ₹ 110 కోట్లతో తీస్తే పాతిక కోట్లు కూడా రాలేదు.. ఓటీటీలో విడుదలైన బాలీవుడ్‌ మూవీ!

Selfiee: అక్షయ్‌, ఇమ్రాన్‌ హష్మి కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ మూవీ ‘సెల్ఫీ’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 22 Apr 2023 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాది చిత్రాలపై బాలీవుడ్‌ నటులు, దర్శకులు ఎలా మనసు పారేసుకుంటున్నారో  ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ రివ్యూ సందర్భంగా మనం చర్చించుకున్నాం. ఏ రీమేక్‌ అయినా, అక్కడి ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేసి తీర్చిదిద్దితే హిట్‌ ఖాయం. కానీ, సినిమా ఎగ్జిక్యూషన్‌ సరిగా లేకపోవడం, మితిమీరిన హీరోయిజం జొప్పించడంతో అభిమానులను మాత్రమే ఆ సినిమాలు అలరిస్తున్నాయి. అలాంటి చిత్రమే అక్షయ్‌కుమార్‌ ‘సెల్ఫీ’ (selfie). రాజ్‌ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌, ఇమ్రాన్‌ హష్మి, డయానా పెంటి, నుస్రత్‌ బరూచ్చా కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. మలయాళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు రీమేక్‌. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సుమారు రూ.110 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే, పట్టుమని పాతిక కోట్లు కూడా రాలేదన్నది ట్రేడ్‌ వర్గాల అంచనా. ఇక ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్‌ 22 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని