Janhvi Kapoor: అమ్మా.. నేను ఇప్పటికీ నీకోసం వెతుకుతున్నాను: జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తన తల్లి శ్రీదేవి (Sridevi)ని గుర్తుచేసుకుంది. తనతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ఆమె కోసం ఎమోషనల్‌ నోట్‌ రాసింది. ప్రస్తుతం అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Published : 21 Feb 2023 19:51 IST

హైదరాబాద్‌: అలనాటి అందాలతార శ్రీదేవి (Sridevi) ముద్దుల కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతోంది. తాజాగా ‘మిలీ’ (Mili) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ బ్యూటీ సమయం వచ్చినప్పుడల్లా తన తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. తాజాగా జాన్వీ శ్రీదేవి కోసం పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం నెటజన్లను ఆకర్షిస్తోంది.

శ్రీదేవితో ఉన్న ఫొటో షేర్‌ చేసిన జాన్వీ.. ‘‘అమ్మా.. నేను ఇప్పటికీ నీకోసం ప్రతిచోటా వెతుకుతూనే ఉన్నాను. నేను చేసే ప్రతి పని నువ్వు గర్వించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను వెళ్లే ప్రతిచోటూ.. చేసే ప్రతి పని నీతోనే మొదలవుతుంది. నీతో ముగుస్తుంది’’ అంటూ హార్ట్‌ ఎమోజీని జోడించింది. ఇక ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. వరుణ్‌ ధావన్‌తో ‘బవాల్’‌ (Bawaal)లో నటిస్తోంది. నీతీష్‌ తివారీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనితో పాటు జాన్వీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr and Mrs Mahi) అనే సినిమాలోనూ నటిస్తోంది.

మరోవైపు జాన్వీ సౌత్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తోంది. త్వరలోనే తాను దక్షణాది చిత్రాల్లో నటించనున్నట్లు గతంలో తెలిపింది. దీంతో ఈ అమ్మడు ఏ హీరో సరసన నటించనుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో జాన్వీ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్‌ చేయనున్న సినిమాలోనూ జాన్వీనే హీరోయిన్‌ అని సమాచారం. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని