Keerthy Suresh: అక్క సిద్ధమైంది

‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాదు.. తన నటనతో మహానటి అని నిరూపించుకుంది కథానాయిక కీర్తిసురేశ్‌.

Updated : 12 Dec 2023 09:29 IST

‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాదు.. తన నటనతో మహానటి అని నిరూపించుకుంది కథానాయిక కీర్తిసురేశ్‌. తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా రాణిస్తున్న ఈమె..వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ధరమ్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది సిరీస్‌ బృందం. రివేంజ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో రాధికా ఆప్టే మరో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సిరీస్‌ చిత్రీకరణలో పాల్గొనడానికి కీర్తి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘షూటింగ్‌ కోసం ముంబయికి చేరుకుంది కీర్తి. ఈ థ్రిల్లర్‌   సిరీస్‌లో కీర్తి, రాధికా మధ్య ముఖాముఖి పోరాటాలు ఉంటాయి’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్‌ను యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తుంది. ప్రస్తుతం ‘సైరెన్‌’, ‘రివాల్వర్‌ రీటా’ సినిమాల్లో నటిస్తుంది కీర్తి సురేశ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని