RRR: జపాన్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న చరణ్-ఉపాసన.. ఎన్టీఆర్‌కు అభిమానుల లేఖ

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌ కోసం రామ్‌చరన్‌ తన భార్య ఉపాసనతో కలిసి జపాన్‌ వెళ్లారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడ లోకల్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. 

Published : 20 Oct 2022 01:36 IST

హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రామ్‌ చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో అక్టోబర్‌ 21న విడుదలవ్వనుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ కోసం రామ్‌చరణ్‌ తన భార్య ఉపాసనతో కలిసి జపాన్‌ వెళ్లారు. అక్కడ లోకల్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఉపాసన తన సోషల్‌మీడియాలో వారికి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక జపాన్‌లో రామ్‌ చరణ్‌ అభిమానులు వారి అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు. జపాన్‌లో దొరికే వివిధరకాల తినుబండారాలు, సీడీలు, కూల్‌డ్రింక్‌ సీసాలపై రామ్‌ చరణ్‌ ముఖాన్ని చిత్రీకరించి విక్రయిస్తున్నారు. 

ఇక ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాను RC15గా పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, జయరామ్‌, సునీల్‌, శ్రీకాంత్, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

ఎన్టీఆర్‌కు లేఖ..

ఎన్టీఆర్‌కు జపాన్‌లో విశేష క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుతూ కొందరు లేఖ రాశారు. దాన్ని ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్‌కు అందజేశారు. ఆ లెటర్‌కు ఫిదా అయిన ఎన్టీఆర్‌ ఆమెతో కాసేపు ముచ్చటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని