Maanaadu: శింబు సినిమా సీక్వెల్‌ రానుందా..!

2021లో విడుదలైన శింబు సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా మానాడు (తెలుగులో ‘ది లూప్‌’). ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో చిత్రబృందం సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తోంది. 

Published : 25 Nov 2022 16:17 IST

హైదరాబాద్‌: మన్మథ లాంటి ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు శింబు. ఈ టాలెంటెడ్‌ హీరో కథానాయకుడిగా నటించిన మానాడు తమిళ చిత్రం తెలుగులో ‘ది లూప్‌’ పేరుతో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. శింబు కెరీర్‌లో రూ.100 కోట్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ మేకింగ్‌ జర్నీ వీడియోను షేర్‌ చేసింది.

వీడియోకు ‘లూప్‌ త్వరలోనే కొనసాగుతుంది..’ అనే వ్యాఖ్య జోడించారు. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ రానుందని ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. వీడియో విడుదలైనప్పటి నుంచి సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టైమ్‌లూప్‌లో చిక్కుకున్న అబ్దుల్‌ ఖాలిక్‌ పాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చిత్ర యూనిట్‌ అభిమానుల కోసం నవంబర్‌ 27న ప్రత్యేక షో నిర్వహించనుంది. సినిమా క్లైమాక్స్‌లోనూ సీక్వెల్‌ ఉంటుందని చిత్ర బృందం హింట్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని