Manjima Mohan: పది రోజుల్లో పెళ్లి.. ఫొటోలన్నీ డిలీట్‌ చేసేసిన నటి

‘కడలి’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో తెలుగు వారికి చేరువయ్యారు నటుడు గౌతమ్‌ కార్తిక్‌, నటి మంజిమా మోహన్‌.

Published : 17 Nov 2022 16:34 IST

చెన్నై: మరో పదిరోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు నటి మంజిమా మోహన్ (Manjima Mohan)‌, నటుడు గౌతమ్‌ కార్తిక్‌ (Gautham Karthik). వీరి పెళ్లి అప్‌డేట్‌ల కోసం అభిమానులందరూ ఆశగా ఎదురు చూస్తోన్న వేళ ఇన్‌స్టాలో ఫొటోలు డిలీట్‌ చేసి సినీ ప్రియుల్ని షాక్‌కు గురి చేశారు మంజిమా. ఇంతకీ ఆమె ఇన్‌స్టా పోస్టులు ఎందుకు డిలీట్‌ చేశారు? దానిపై ఆమె  ఎలా స్పందించిందంటే..

2019లో విడుదలైన కోలీవుడ్‌ చిత్రం ‘దేవరట్టం’ కోసం గౌతమ్‌ - మంజిమా తొలిసారి స్క్రీన్‌షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఎంతోకాలం నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ ఇటీవల తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ మేరకు నవంబర్‌ 28న చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇదిలా ఉండగా, కొన్నిరోజుల క్రితం మంజిమా తన ఇన్‌స్టాలోని పోస్టులన్నింటినీ డిలీట్‌ చేశారు. కార్తిక్‌తో రిలేషన్‌షిప్‌ని అధికారికంగా వెల్లడించిన పోస్ట్‌, తన పెంపుడు పిల్లి ఫొటో మినహా మిగిలిన పోస్టులన్నింటినీ ఆమె ఇన్‌స్టా నుంచి తొలగించారు. ఆమె ఎందుకు అలా చేసింది? అని పలువురు సినీ ప్రియులు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘ఎదుటివారితో సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇన్‌స్టా మంచి ప్రదేశం. ఇప్పటి వరకూ నేను షేర్‌ చేసిన పోస్టులన్నింటినీ ఆర్కైవ్‌ చేశా. ఇప్పుడు నా ప్రయాణం మళ్లీ మొదలైంది’’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని