MAA Election: నాగబాబు మాటలు బాధించాయి
‘‘గడిచిన నాలుగేళ్ల కాలాన్ని చూసుకుంటే ‘మా’ మసకబారిపోయింది’’ అంటూ శుక్రవారం జరిగిన
‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు
వారిని చూసి షాకయ్యా
‘మా’ అధ్యక్షుడు నరేష్ మీడియా సమావేశం
హైదరాబాద్: ‘‘మా’ మసకబారిపోయింది’’ అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. నాగబాబు తనకి మంచి మిత్రుడని.. ‘మా’ చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని నరేశ్ తెలిపారు. తన ప్యానల్ని పరిచయం చేస్తూ తాజాగా నటుడు ప్రకాశ్రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్గా శనివారం ఉదయం నరేశ్ మీడియా ముందుకు వచ్చారు. తాను అధ్యక్షుడిగా ‘మా’ ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు..
‘నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడం అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు. నాకెంతో ఆప్తురాలైన సీనియర్ నటి జయసుధకు అండగా ఉండాలని.. ‘మా’లో మార్పు తీసుకురావాలని ఎన్నికలకు వెళ్లాను. కానీ గడిచిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆవిషయం నన్ను ఎంతో బాధించింది. నువ్వు జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు. కానీ, ప్రెసిడెంట్ అయి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను.’
‘నరేశ్ అంటే ఏమిటో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను సినిమా వాడిని. సినిమా బిడ్డను. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది’
ఎవరు వచ్చినా స్వాగతిస్తాం..
‘ప్రకాశ్రాజ్ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే నాకు ఫోన్ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. ‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు. చిరంజీవి, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది సినీ పెద్దలు.. మెట్టు మెట్టు పేర్చి దీనిని స్థాపించారు. ఇప్పటివరకూ ఉన్న అధ్యక్షులందరూ ‘మా’ అభివృద్ధి కోసమే ఎంతో కష్టపడి పనిచేశారు’
మేమంతా షాకయ్యాం..
‘శుక్రవారం ప్రకాశ్రాజ్.. తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీటింగ్ పెట్టడాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ప్రస్తుతం జనరల్ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాశ్రాజ్ ప్యానల్లో చేరి.. నిన్న జరిగిన సమావేశంలో కనిపించడం చూసి మేమంతా షాకయ్యాం. అదే సమావేశంలో నటుడు నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన నాకు ఆప్తమిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ప్రతి విషయాన్ని సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేశాను. అలాంటిది నాగబాబు.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పు. లోకల్ నాన్లోకల్ అని మేము అనలేదు. ఇప్పుడు కూడా ఎన్నిక ఏకగ్రీవం కావాలని మేము కోరుకుంటున్నాం’
సెప్టెంబర్లోనే ఎన్నికలు..
‘‘ఎన్నికల గురించి సమాచారం అడుగుతూ ఏప్రిల్ 9న ‘మా’కు ప్రకాశ్రాజ్ ఓ లేఖ రాశారు. దానికి మేము ఏప్రిల్ 12న సమాధానం కూడా ఇచ్చాం. ‘మా’ అధ్యక్ష ఎన్నిక సెప్టెంబర్ టు సెప్టెంబర్లోనే జరగాలని కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత పరిచూరి గోపాలకృష్ణ ప్రతిపాదన పెట్టారు. ఆయన పెట్టిన ప్రతిపాదనకు అందరూ ఓకే అన్నారు. ఆ క్రమంలోనే ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ‘మా’లో ఉన్న సభ్యుల సంఖ్య చెప్పడంలో ప్రకాశ్రాజ్ తడబడ్డారు. ఆయన దగ్గర సరైన డేటా లేదు. ‘మా’లో మేము ఇప్పటివరకూ చేసిన పనుల గురించి చెప్పడం కోసమే డేటాతో సహా వచ్చాను’
‘మా’పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు?
‘‘మా’లో మొత్తం 914 మంది జీవితకాల సభ్యులు , 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి సుమారు 728 మంది సభ్యులకు రూ.3 లక్షలతో జీవిత బీమా చేయించాం. ఇప్పటివరకూ మృతిచెందిన 16 మంది సినీ ఆర్టిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు అందజేశాం. 314 మంది సభ్యులకు ఆరోగ్య బీమా చేయించాం. రూ.3 వేలు ఉన్న పింఛన్ను రూ.6 వేలకు పెంచాం. ‘మా’ సభ్యత్వ నమోదును రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం. కొత్తగా 87మంది సభ్యులు అసోసియేషనలో చేరారు.‘మా’పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు?. జాబ్ కమిటీ ద్వారా 35 మంది వృద్ధ కళాకారులకు సినిమాల్లో అవకాశం కల్పించాం. కరోనా కష్టకాలంలో ‘మా’ అసోసియేషన్కు రూ.30 లక్షల విరాళాలు అందాయి. అందులో జీవిత రూ.10 లక్షలు అందించారు. వాటిలో రూ.లక్షను చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీకి పంపిచాం. మేము చేసిన పనికి చిరు ఫోన్ చేసి అభినందించారు. అలాగే, నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అసోసియేషన్లో నిధులు తక్కువగా ఉన్నాయని చెప్పగానే మా అమ్మ విజయనిర్మల రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత కూడా విరాళాలు అందించారు. ఇలా ఆమె మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారు. అసోసియేషన్లో నేను 20 ఏళ్లుగా సభ్యుడిగా ఉన్నప్పటికీ ఎలాంటి పదవీ ఆశించలేదు. కావాలంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పదవుల కోసం ఆశపడడం లేదు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ నా వంతు సాయం చేస్తూనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మేము చేసిన పనుల్ని తక్కువగా చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు. మేము హింసకు లొంగం. కృష్ణంరాజుగారికి ఫోన్ చేసి ప్రెస్మీట్ పెడుతున్నట్లు చెప్పాను. ‘‘మా’ ఒక దిగ్గజం. వంద ఏనుగుల బలం ఇందులో ఉంది. ‘మా’ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదు’ అని కృష్ణంరాజు చెప్పమన్నారు’’ అని నరేశ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్