Thaman: వాడు ఇలాంటి పని చేస్తాడనుకోలేదు: తమన్
జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా కానీ ఈరోజు ఎంతో బాధగా ఉందని అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్ ఆల్బమ్స్తో మాంచి ఫామ్లో వెళ్తోన్న ఆయన ప్రస్తుతం మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ కోసం....
జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా కానీ... పాట లీక్పై సంగీత దర్శకుడు భావోద్వేగం
హైదరాబాద్: జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా కానీ ఈ రోజు ఎంతో బాధగా ఉందని అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్ ఆల్బమ్స్తో మాంచి ఫామ్లో దూసుకెళ్తున్న ఆయన ప్రస్తుతం మహేశ్బాబు నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ కోసం పని చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలోని మొదటి పాటని ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని సైతం ఇటీవల విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రం ‘కళావతి’ ఫుల్సాంగ్ నెట్టింట్లో లీక్ అయ్యింది. దీనిపై చిత్రబృందం షాకైంది. తమన్ భావోద్వేగానికి గురయ్యారు. హృదయం ముక్కలైందంటూ ఓ ఆడియోని ట్విటర్లో షేర్ చేశారు.
‘‘మనసంతా బాధగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సుమారు ఆర్నెళ్లుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం. ఈ పాట షూట్ చేసినప్పుడు ఎనిమిది మందికి కరోనా వచ్చింది. అయినా సరే, మేమంతా కలిసి మంచి సాంగ్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశాం. త్వరలో మీ అందరికీ ఈ పాట వినిపించాలనుకున్నాం. కానీ, ఒకడు అంత ఈజీగా దీన్ని లీక్ చేసేసి.. ఆన్లైన్లో పెట్టేశాడు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాడికి పని ఇస్తే ఈ పని చేస్తాడనుకోలేదు. గుండె తరుక్కుపోతుంది. కోపం, బాధ ఉప్పొంగుకొస్తున్నాయి. దీన్ని ఇలాగే వదిలేసి ఎలా ముందుకు సాగిపోవాలో అర్థం కావడం లేదు. గుండె ముక్కలైనట్లు ఉంది. సాధారణంగా నేను ఎంతో ధైర్యంగా ఉంటాను. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు ఈరోజు ఎంతో బాధకు గురవుతున్నాను. ఈ ఆడియో పెట్టడానికి కారణం ఏమిటంటే.. పైరసీ చేసినవాడికి మా బాధ అర్థం కావాలి. పైరసీ ఎంత ఘోరమైన విషయమో తెలుసుకోవాలి. సుమారు 1000 మంది కష్టం ఈ పాట. అభిమానులందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నా’’ అని తమన్ చెప్పుకొచ్చారు. మరోవైపు పాట లీక్ కావడంతో 14వ తేదీన రిలీజ్ చేయాల్సిన ‘కళావతి’ పాటను ఆదివారం (13వ తేదీ) విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్