నేనింతటి స్టార్ని అవడానికి కారణం అదే!
‘నా కెరీర్లో ‘వైల్డ్ డాగ్’ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని అన్నారు ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున.
అక్కినేని నాగార్జున
‘నా కెరీర్లో ‘వైల్డ్ డాగ్’ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని అన్నారు ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున. అహిషోర్ సాల్మన్ తెరకెక్కించిన చిత్రమిది. సయామీ ఖేర్, దియా మీర్జా నాయికలు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడారు నాగార్జున. ఆ విశేషాలివీ...
త్వరగా పూర్తవుతుందని..
2019లో ‘బంగార్రాజు’ చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నా. అదే సమయంలో ‘వైల్డ్ డాగ్’ స్ర్కిప్టు తీసుకొచ్చారు సాల్మన్. ఇది అయితే త్వరగా చిత్రీకరణ పూర్తి చేయొచ్చని భావించి ప్రారంభించాను. లాక్డౌన్కి ముందే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి మిగిలిన చిత్రీకరణ పూర్తిచేశాం.
ఆ నమ్మకం ఉంది..
ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ ఇది. వేగవంతమైన స్క్రీన్ ప్లే కొత్త అనుభూతి పంచుతుంది. ఈ చిత్రంలో ఎన్.ఐ.ఎ టీమ్ లీడర్గా విజయ్ వర్మ అనే పాత్రలో కనిపిస్తాను. తండ్రి, భర్త, స్నేహితుడు ఇలా అన్ని బంధాలు అల్లుకున్న పాత్ర ఇది. వ్యక్తిగతంగా నాకు ఈ పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ పాత్ర కోసం నేను ఏ అధికారిని కలవలేదు. కానీ, దర్శకుడు సాల్మన్ కథకి సంబంధించి రీసెర్చ్లో భాగంగా సర్జికల్ స్ట్రైక్లో పాల్గొన్న ఓ ఆర్మీ మేజర్ని కలిశారు. ఆయన సెట్కి వచ్చి కొన్ని మెలకువలు నేర్పించారు. ఇది నా కెరీర్లో చెప్పుకునే ప్రత్యేక పాత్ర అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.
ట్రైలర్ చూసి నిర్ణయానికొస్తున్నారు..
ఈ చిత్రానికి సంబంధించి ప్రచారంపైనా ఎక్కువ శ్రద్ధ పెట్టాను. నేను తప్ప అందరూ కొత్త వాళ్లే. దర్శకుడితో సహా. కాబట్టి ఇలాంటి కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే అదనంగా ప్రమోట్ చేయాల్సిందే. ఆ ఆలోచనతోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రానికి కాస్త విరామం ఇచ్చి ప్రచారంలో పాల్గొంటున్నాను. సినిమా తెరకెక్కించేందుకు ఎంత జాగ్రత్త తీసుకున్నామో ట్రైలర్ కోసం అంతే జాగ్రత్త తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ చూసే సినిమా కోసం థియేటర్కి వెళ్లాలా, వద్దా? అనుకుంటున్నారు ప్రేక్షకులు. వాళ్లని మెప్పించే ప్రయత్నంలో భాగంగా ఆరేడు సార్లు ట్రైలర్ని కట్ చేశాం. ఈ సినిమాలో కొత్తగా ఏం ఉండబోతుందో అది ట్రైలర్లో చూపించాం.
దాన్ని ఇష్టపడను..
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాల్లో రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలు పెట్టేందుకు వీలుండదు. అవి లేకపోతే సినిమా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్లని బ్యాలెన్స్ చేశాం. నన్ను నేను ఒకే రకమైన పాత్రల్లో చూసుకోవడానికి ఇష్టపడను. కొత్త కథలు వచ్చినపుడు పాత్రలూ కొత్తగా ఉంటాయి. అది నూతన దర్శకులైతేనే చేయగలరు. అందుకే వాళ్లకి ఎక్కువగా అవకాశం ఇస్తుంటాను. నేను ఇంతటి స్టార్ అవడానికి కారణం అదే. ఈ ప్రయత్నంలో పరాజయాలు ఎదురైనా పట్టించుకోను.
‘శివ’ విషయంలోనూ ఇలానే అన్నారు..
నేను ఫిట్నెస్ని ఇష్టపడతాను. అందుకే ఈ వయసులోనూ యాక్షన్ చిత్రం చేశాను. పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యం కావడంతో కుటుంబ ప్రేక్షకులు రారేమో అనే సందిగ్థత ఉంటుంది. ‘శివ’ చిత్రానికి ఇలానే అన్నారు. అయినా ఆడవాళ్లు కోరుకునేది ఇలాంటి పవర్ఫుల్ మగవాళ్లనే కదా (నవ్వుతూ..). ప్రస్తుతానికి ఈ కథని తెలుగులో తెరకెక్కిస్తే చాలు అనుకున్నాం. త్వరలోనే హిందీలో డబ్ అవుతుంది. ప్రేక్షకులు ఓటీటీ వల్ల అన్ని రకాలుగా ఎక్స్పోజ్ అయ్యారు. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి న్యూ ఏజ్ కమర్షియల్ చిత్రాలకు ఓ విధంగా ప్లస్ అవుతుంది.
తదుపరి చిత్రాలు..
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రాజ్ తరుణ్తో ఓ చిత్రం నిర్మిస్తున్నాను. వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా రూపొందించబోతున్నాను. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా. నా విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం జులైలో పూర్తయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ‘బంగార్రాజు’ మొదలుపెడతాను. హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో మంచి పాత్ర పోషిస్తున్నాను. అఖిల్తో కలిసి పవర్ఫుల్ యాక్షన్ చిత్రం ఒకటి చేయాలని ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు