Pooja Hegde: అప్పుడు ఎంతో బాధపడ్డా.. మొదటిసారి ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడిన పూజాహెగ్డే

అనుకోకుండా తాను సినిమాల్లోకి అడుగుపెట్టానని అన్నారు నటి పూజాహెగ్డే (Pooja Hegde). ప్రతి చిత్రాన్ని ప్రేమతో చేస్తానని చెప్పిన ఆమె మొదటిసారి ఓ సినిమా పరాజయంపై స్పందించారు.

Updated : 15 Apr 2023 13:51 IST

ముంబయి: ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి పూజాహెగ్డే (Pooja Hegde). ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన జయాపజయాలపై ఆమె స్పందించారు. ముఖ్యంగా ‘సర్కస్‌’ (Cirkus) ఫెయిల్యూర్‌పై మొదటిసారి మాట్లాడారు.

‘‘నేను నటించే ప్రతి చిత్రాన్ని సొంత బిడ్డలా చూస్తాను. ‘సర్కస్‌’ కూడా అలాంటిదే. ఆ సినిమా పరాజయంతో బాధపడ్డా. ఇది నన్ను నిరుత్సాహపరిచినప్పటికీ.. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో పనిచేయడం గొప్పగా భావిస్తున్నాను. జానీ లీవర్‌, సంజయ్‌ మిశ్రా వంటి నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం దక్కింది. అలాగే, ఆ సినిమాలో నా పాత్ర ఎంతోమందికి నచ్చింది. నా వరకూ మంచి పేరే వచ్చింది’’ అని ఆమె వివరించారు.

అనంతరం ఆమె ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’లోని ‘ఏంటమ్మా’ సాంగ్‌ కాంట్రవర్సీపై మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. మా సినిమాలో ఎంతోమంది దక్షిణాది నటీనటులు ఉన్నారు. ఆయా విషయాల్లో వారు కూడా శ్రద్ధ పెట్టారు. నేను కూడా ఒక దక్షిణాది అమ్మాయినే అయినందుకు గర్వపడుతున్నా’’ అని అన్నారు. 

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) - పూజాహెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’. ఫర్హాద్‌ సామ్జీ దీన్ని తెరకెక్కించారు. వెంకటేశ్‌, భూమిక కీలకపాత్రలు పోషించారు. ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 21న ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని