Prakash Raj: అప్పూ సేవలను కొనసాగిస్తూ.. ప్రకాశ్‌రాజ్‌ కీలక ప్రకటన

తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక ప్రకటన చేశారు. కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ (అప్పూ) సేవలను ‘ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌’ ద్వారా ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.

Published : 26 Mar 2022 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శనివారం కీలక ప్రకటన చేశారు. కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ (అప్పూ) సేవలను ‘ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌’ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. సంబంధిత వివరాలు త్వరలోనే పంచుకుంటానన్నారు. ఈ మేరకు అప్పూ ఫొటోతో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘అప్పూ ఎక్స్‌ప్రెస్‌’ అని రాసి ఉంది. ఈ పోస్ట్‌పై ఇప్పటికే పలువురు నెటిజన్లు స్పందించారు. కామెంట్ల రూపంలో ఆయన్ను అభినందించారు. తన ఫౌండేషన్‌ ద్వారా ప్రకాశ్‌రాజ్‌ లాక్‌డౌన్‌/ కొవిడ్‌ సమయంలో ఎంతోమందికి సాయం చేశారు. తన ఫాంహౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు.. మరో అడుగు ముందుకేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో కోట్ల హృదయాల్ని గెలిచిన పునీత్‌ గుండెపోటుతో గతేడాది హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని