Adhira: హీరోగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత తనయుడు.. చరణ్‌, తారక్‌, రాజమౌళి సర్‌ప్రైజ్‌

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్‌ తెరంగేట్రం చేస్తున్నారు. ఈయన హీరోగా వైవిధ్య దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘అధీరా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Published : 23 Mar 2022 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్‌ తెరంగేట్రం చేస్తున్నారు. ఈయన హీరోగా వైవిధ్య దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘అధీరా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. కల్యాణ్‌ను పరిచయ ఓ వీడియోను ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.

‘అధీరా ఫస్ట్‌ స్ట్రైక్‌’ పేరిట రూపొందిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కల్యాణ్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి సంగీతం: గౌరహరి, కూర్పు: శ్రీకాంత్‌ పట్నాయక్‌, ఛాయాగ్రహణం: శివేంద్ర. ‘జంబలకిడి పంబ’తో సినీ నిర్మాతగా మారిన దానయ్య ‘మావిడాకులు’, ‘సముద్రం’, ‘శివమణి’, ‘దేశముదురు’, ‘జులాయి’, ‘భరత్‌ అనే నేను’ తదితర సినిమాలతో తనదైన ముద్రవేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్థాయి చిత్ర నిర్మాతల జాబితాలో చేరారు. ఈ చిత్రం మార్చి 25న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని