Guntur Kaaram: చెప్పిన డేట్‌ గుర్తుపెట్టుకోండి: ‘గుంటూరు కారం’పై నిర్మాత ట్వీట్‌

మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా సెన్సార్‌ పూర్తయిందని నిర్మాత నాగవంశీ తెలిపారు.

Published : 05 Jan 2024 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డేట్‌, టైమ్‌ గుర్తుపెట్టుకోండి’ అంటూ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాపై ఆసక్తికర ట్వీట్‌ చేశారు నిర్మాత నాగవంశీ (Naga Vamsi). ఆ చిత్రానికి సెన్సార్‌ పూర్తయిందని తెలియజేస్తూ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘చూడగానే మజా వస్తుంది, హార్ట్‌బీట్‌ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్‌ బొమ్మ లోడింగ్‌’ అని పేర్కొన్నారు. ఆ మాట చెప్పిన రోజు (జనవరి 4), సమయాన్ని గుర్తుపెట్టుకోండంటూ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.

రవితేజ ‘ఈగల్‌’ ఫిబ్రవరికి వాయిదా.. సంక్రాంతికి ఆ నాలుగు చిత్రాలే

‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తయింది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని నాగవంశీ ఇటీవల సోషల్‌ మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ నెల 6న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. అదే రోజున ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని