Bollywood: బాలీవుడ్‌లో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటి తల్లి మృతి

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌(Rakhi Sawant) తల్లి మరణించారు. గతకొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 29 Jan 2023 11:52 IST

ముంబయి: బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటీ రాఖీ సావంత్‌(Rakhi Sawant) తల్లి జయ(Jaya) నిన్న రాత్రి కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణ వార్తను రాఖీ సావంత్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇది తెలిసిన పలువురు బాలీవుడ్‌(Bollywood) ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఆసుపత్రిలో ఉన్న వీడియోను పోస్ట్‌ చేసిన రాఖీ ఎమోషనల్‌ నోట్‌ రాసింది.

‘‘ఎప్పుడూ నన్ను ఆశీర్వదించే మా అమ్మ చేయి ఇక నా తలపై ఉండదు. ఇక నేను కోల్పోవడానికి ఏమీ లేదు అమ్మా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్‌ యూ అమ్మా..’’ అని తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్‌ చూసిన నటీనటులు రాఖీకి ధైర్యం చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని