satyadev: ప్రతి ప్రేక్షకున్ని గాడ్సే హెచ్చరిస్తుంది
విభిన్న కథలు/పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు సత్యదేవ్. అనతికాలంలోనే మంచి కథానాయకుడిగానూ మెప్పించారు.
కచ్చితంగా పాన్ఇండియా సినిమా చేస్తా
విభిన్న కథలు/పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు సత్యదేవ్(satyadev). అనతికాలంలోనే మంచి కథానాయకుడిగానూ మెప్పించారు. ‘బ్లఫ్ మాస్టర్’, ‘తిమ్మరుసు’ తదితర చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నారు. తాజాగా గోపీ గణేశ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన మరో విభిన్న చిత్రం ‘గాడ్సే’ జూన్ 17న విడుదలవుతున్న నేపథ్యంలో సత్యదేవ్ పంచుకున్న విశేషాలివే.
గాడ్సే కథ వినగానే ఏమనిపించింది?నటుడిగా ఎలాంటి అనుభూతి చెందారు?
సత్యదేవ్: నటుడిగా నాకు ఆ సత్తా ఉందనే నమ్మకం ఉంది. అదే నన్ను ఇప్పటివరకు నడిపించింది. కానీ, కథ విన్నపుడు ఈ కథ ద్వారా నేను సంధించే ప్రశ్న ఎంత వరకు ప్రేక్షకులను చేరుతుందా? అనిపించింది. డైరెక్టర్ గోపీగణేశ్ ఆ విషయంలో నాకు పూర్తి భరోసా ఇచ్చారు. టీజర్, ట్రైలర్లకు వచ్చిన స్పందన చూశాకా మేము సంధించిన ప్రశ్నలు ప్రేక్షకులకు చేరుతాయనే నమ్మకం కలిగింది.
గాడ్సేలో కథానాయకుడి పాత్ర చేయడానికి ఎలాంటి కసరత్తు చేశారు?
సత్యదేవ్: హోమ్ వర్క్ అంటూ ఏం లేదు. మనలో కూడా సమాజానికి సంబంధించి బాధ్యత అనేది ఉంటుంది కదా.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎవరు లేకపోయిన మనం రూల్స్ పాటించాలి అనే విషయాన్ని డ్రైవర్కు నేనెప్పుడూ చెబుతూ ఉంటా. అతను ఆ క్షణంలో పాటించకపోయినా తనలో ఆ ఆలోచనని కలిగిస్తే భవిష్యత్లో పాటిస్తాడనే నమ్మకం. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా అయిన సమాజం పట్ల మనకున్న ప్రేమను చూపించొచ్చు. అది నాలో ఉంది కాబట్టే ఇలాంటి కథ నా దగ్గరకు వచ్చిందని నమ్ముతున్నా. మనలో ఉండే ప్రశ్నించేతత్వాన్ని చూపించేదే ఈ కథ.
‘గాడ్సే’ టైటిల్ను ఎంపిక చేసుకోవడం వెనుక కారణం పబ్లిసిటీ కోసమా? ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేయడానికా?
సత్యదేవ్: రెండూ కారణమే. ఒక నాటకంలో గాడ్సే పాత్ర చేసిన ఓ చిన్న కుర్రాడు గాంధీని చంపనని, ఆయనంటే ఇష్టమని అక్కడినుంచి పారిపోతాడు. అటువంటి నేపథ్యం ఉన్న అతను రెండు గన్నులతో స్వైర విహారం చేస్తున్నాడంటే అతనికి ఏదో అన్యాయం జరిగి ఉంటుంది. అతని పేరు విశ్వనాథ రామచంద్ర కాని అందరూ గాడ్సే అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గాడ్సే అనే టైటిల్ పెట్ట్డడానికి కారణం అది కథలో భాగం కావడమే.
మామూలుగా ఇటువంటి వ్యతిరేక నేపథ్యం ఉన్న టైటిల్ పెట్టడం ద్వారా వివాదాస్పదం అయ్యే ప్రమాదం లేదంటారా?
సత్యదేవ్: రాజకీయ కోణానికి సంబంధించిన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ కథ ఒక మతానికో, ప్రాంతానికో పరిమితమైనది కాదు. సమాజంలో అందరికి తెలిసిన అన్ని అంశాలపై తీసుకున్న కథాంశం కాబట్టి ఎటువంటి కాంట్రవర్సీ ఉండదనేది మా ఉద్దేశం. సినిమా చూశాకా ప్రేక్షకులు ఒక సానుకూల దృక్పథంతో బయటకు వస్తారు. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్కూ ఢోకా లేదు.
మీ సినిమాలో యాక్షన్ సీన్లను ఆశించవచ్చా?
సత్యదేవ్: ఈ సినిమాలో యాక్షన్, డ్రామా,ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సినిమా చూసిన అనంతరం ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు.
గాడ్సేకు దర్శకుడు మిమ్మల్నే కథానాయకుడిగా ఎంచుకోవడానికి కారణం ఏంటి?సందేశం ఏదైనా ఉందా?
సత్యదేవ్: గోపీగణేశ్తో ఇంతకుముందు ‘బ్లఫ్ మాస్టర్’ చేశా. అది సమాజంపై సెటైరికల్ మూవీ. ఆ సినిమాకు నన్నే హీరోగా తీసుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇద్దరం ఒకరిని ఒకరం నమ్మాం. దాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ కారణంతోనే గాడ్సేకు నన్ను ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను. మా సినిమా ఎటువంటి సందేశాన్ని బోధించదు. సమాజంలో జరిగే విషయాలనే చూపిస్తుంది. ప్రతీకారం తీర్చుకుంటున్న కథానాయకుడు చెప్పే కథ ఇది. మేము ప్రేక్షకున్ని ఎలా అలరిస్తామనేది ట్రైలర్ ద్వారానే వారికి అర్థమైంది.
హీరోయిన్గా ఐశ్వర్యలక్ష్మీనే తీసుకోవడానికి కారణమేంటి?
సత్యదేవ్: ఆమె అద్భుతమైన నటి. మలయాళంలో మాయానది, వరదన్ సినిమాలతో నిరూపించుకుంది. అటువంటి హీరోయిన్ గాడ్సేతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఆమె పాత్ర సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఆమెది ఒక ప్రత్యేకపాత్ర. ఆ పాత్రకు ఎటువంటి లవ్స్టోరీ లేదు. హీరో పాత్రను కంట్రోల్ చేసే రోల్లో ఆమె బాగా నటించారు. దర్శకుడు నాకు సమాజానికి మధ్య మాత్రమే లవ్స్టోరీని తీర్చిదిద్దాడు(నవ్వులు)
ప్రస్తుతం పాన్ఇండియా సినిమాల హవా నడుస్తోంది కదా? మీ నుంచి ఎప్పుడు ఆశించవచ్చు?
సత్యదేవ్: బాహుబలి, ఆర్ఆర్ఆర్లతో రాజమౌళి సినిమా హద్దులను చెరిపేశారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాగా తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఇది మంచి పరిణామం. పాన్ఇండియా సినిమా చేయడం నా కల. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి.క చ్చితంగా చేస్తా.
బాలీవుడ్లో అక్షయ్కుమార్ రామ్సేతులో మీరు నటిస్తున్నారు కదా! ఆ పాత్ర ఎలా ఉండబోతోంది?
సత్యదేవ్: నటిస్తున్న మాట నిజమే. కానీ దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.
చిరంజీవితో ‘ఆచార్య’లో చేశారు కదా ఎలా అనిపించింది?
సత్యదేవ్: నిజంగా అది మరిచిపోలేని అనుభూతి. కల నిజమైనట్లే. నేను చిన్నప్పట్నుంచి ఆయన అభిమానిని. అటువంటిది ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టం అనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య