అందుకు మనసు అంగీకరించడం లేదు.. వాటిని రిజెక్ట్ చేశా: సీనియర్ నటి
పాత్ర ఏదైనా సరే తాను పూర్తిస్థాయిలో ఇష్టపడే చేశానని సీనియర్ నటి సుధ అన్నారు. గత కొంతకాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: సహాయనటిగా దాదాపు 800లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు సీనియర్ నటి సుధ (Sudha). ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోల నుంచి రామ్చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ వరకూ ఎంతోమంది నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘తల్లి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ప్రతి పాత్రను ఇష్టపడే నటించా. అయితే తల్లి పాత్రలు చేయడం ప్రారంభించిన సమయంలో నా తోటి నటీమణులు.. ‘సుధా నువ్వెందుకు తల్లి పాత్రలు చేస్తున్నావు. నువ్విలా చేస్తే రేపు మమ్మల్ని కూడా ఆ పాత్రలకు అడుగుతారు’ అని ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ వల్లే ఇన్నేళ్లపాటు నటిగా కొనసాగి.. ఈ స్థాయిలో నిలబడగలిగాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. నేను నటించిన మొదటి మూడు చిత్రాలు మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పుడు బాలచందర్ నన్ను కలిశారు. ‘నీ మొహం గ్లామర్ రోల్స్కు సెట్ కాదు. హీరోయిన్గా పనికి రావు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది. నీకు ఓకే అయితే నా సినిమాలో హీరోయిన్ సోదరి పాత్ర ఉంది’ అని చెప్పారు. అలా సహాయనటిగా నా ప్రయాణం మొదలుపెట్టా. ఆయనిచ్చిన సలహా వినబట్టే నేనింకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా’’
‘‘ఇప్పుడు కొంతమంది తల్లి పాత్రలు పోషిస్తున్నారు. వాళ్లు పోషించిన ఏ పాత్రా అంతగా నచ్చడం లేదు. నటిగా నాకున్న రికార్డులు వేరు. ఇవీవీ సత్యనారాయణతో 17, రాఘవేంద్రరావుతో 15 సినిమాలు చేశా. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా ప్రతి హీరోతో వర్క్ చేశా. కానీ, ఇప్పటి వాళ్లు అలా కాదు. రికార్డులు కాదు కదా.. ఎన్ని సినిమాల్లో నటిస్తారో కూడా తెలియదు. ఇప్పుడు వస్తోన్న చిత్రాల్లో తల్లి పాత్ర పూర్తిస్థాయిలో ఉండటం లేదు. సరైన డైలాగ్లు కూడా లేకుండా కేవలం స్క్రీన్పై అలా చూపిస్తున్నారు. ఒకప్పుడు తల్లిగా అద్భుతమైన పాత్రలు పోషించిన నేను ఇప్పుడు ఇలా స్క్రీన్పై కనిపించాలంటే మనసు అంగీకరించడం లేదు. ఆత్మసంతృప్తి లేదు. అందుకే ఈ మధ్య చాలా సినిమాలు వదులుకున్నా’’ అని సుధ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..