Sridevi Drama Company: హత్తుకున్న అమర్‌దీప్‌ జర్నీ.. ‘బుల్లెట్టు బండి’తో మోహన సందడి

‘ఈటీవీ’ వేదికగా ప్రేక్షకులకు ప్రతి ఆదివారం వినోదం పంచుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.

Published : 31 Jan 2022 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈటీవీ’ వేదికగా ప్రేక్షకులకు ప్రతి ఆదివారం వినోదం పంచుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈ షో ప్రథమ వార్షికోత్సవం వేడుకల్లో ప్రముఖ గాయని మోహనభోగరాజు, నటుడు అమర్‌దీప్‌ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. తన కెరీర్‌ ఎలా సాగిందో అమర్‌దీప్‌ చూపించగా.. మధురమైన గానంతో మోహన అలరించారు. ‘ఈ వేళలో నీవు‘, ‘ఉరుములు నీ మువ్వలై’, ‘పేరెట్టి నేనెట్టా పిలిచేది’ పాటలతో మైమరపించిన మోహన.. తనకెంతగానో పేరు తీసుకొచ్చిన ‘బుల్లెట్టు బండి’తో హుషారెత్తించారు. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న షో ‘బుల్లెట్టు బండి’ గీతంతో సందడిగా మారింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు మోహనతో కలిసి స్టెప్పులేశారు.

డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తో.. నటుడిగా తన ప్రయాణం ఎలా సాగిందో కళ్లకు కట్టినట్టు చూపించారు అమర్‌దీప్‌. సినిమా రంగానికి సంబంధించిన సంభాషణలతో ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నారు. ఎవరి మద్దతు లేకుండా యూట్యూబర్‌ నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కి ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మోహన, అమర్‌దీప్‌ ప్రతిభకు ఫిదా అయ్యారు. జనవరి 30న ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ ప్రస్తుతం నెట్టింట వినోదం పంచుతోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని