ఇమ్మాన్యుయెల్, వర్ష పెళ్లి సందడి.. మధ్యలో పోలీసులు

బుల్లితెర జంట ఇమ్మాన్యుయెల్‌, వర్ష పెళ్లి పీటలెక్కారు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో భాగంగా ఈ ఇద్దరి పెళ్లి వైభవోపేతంగా జరిగింది. ఆ పెళ్లికి సుధీర్‌ ఆధ్వర్యంలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వెళ్లి సందడి చేసింది. మరి కరోనా సమయం కదా.. కేవలం 20 మందికి మాత్రమే పెళ్లికి హాజరయ్యేందుకు అనుమతి ఉంది.

Published : 29 Jun 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర జంట ఇమ్మాన్యుయెల్‌, వర్ష పెళ్లి పీటలెక్కారు. నిజంగా కాదండోయ్‌.. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో భాగంగా ఈ ఇద్దరి పెళ్లి వైభవోపేతంగా జరిగింది. ఆ పెళ్లికి సుధీర్‌ ఆధ్వర్యంలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వెళ్లి సందడి చేసింది. మరి కరోనా సమయం కదా.. కేవలం 20 మందికి మాత్రమే పెళ్లికి హాజరయ్యేందుకు అనుమతి ఉంది. అయితే, సుధీర్‌ ఇచ్చిన ధైర్యంతో ఇమ్మాన్యుయెల్‌ పరిమితికి మించి చుట్టాలను పిలిచాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో గెటప్‌ శ్రీను పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంటరై అందర్నీ జైల్లో వేశాడు. మరి.. వాళ్లు జైలు నుంచి బయటికి ఎలా వచ్చారు..? పెళ్లి  ఎలా జరిగింది? ఎవరెవరు ఏయే పర్ఫార్మెన్సులు ఇచ్చారో తెలుసుకోవాలంటే జులై 4 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. ఆ రోజే పూర్తి ఎపిసోడ్‌ ప్రసారమయ్యేది. మధ్యలో ఆది, ఆటో రామ్‌ ప్రసాద్‌ పంచులు పంచ్‌లు, ‘అనితా ఓ అనితా’ గ్రూప్‌సాంగ్‌, భాను డ్యాన్స్‌ కనువిందు చేసేలా ఉన్నాయి. అంతవరకు వెయిట్‌ చేసే బదులు అందాక ఈ ప్రోమో చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని