SurekhaVani: ఆ బాధ ఎప్పటికీ పోదు.. ఆయన్ను ఒక్కసారి చూడాలని ఉంది: సురేఖ వాణి

తన భర్త సురేష్‌ తేజను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు నటి సురేఖ వాణి. ఆయన తనకెంతో గౌరవం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

Published : 14 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన భర్త సురేశ్‌ తేజను గుర్తు చేసుకుని ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు నటి సురేఖ వాణి. ‘‘తేజ నాకెంతో గౌరవమిచ్చేవాడు. మేమిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాం. దేవుడు ఇప్పుడు నాకో అవకాశం ఇచ్చి తేజ కనిపిస్తే.. నా మనసులో ఉన్న బాధ మొత్తం పంచుకోవాలనుకుంటున్నా. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. క్షమాపణలు చెప్పాలి. ఈ బాధ ఎప్పటికీ పోదు. ఆయన నాతోనే ఉన్నారని నమ్ముతున్నా’’ అని భావోద్వేగానికి గురయ్యారు.

సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘కామెంట్స్‌ చూసి మొదట్లో ఎంతో బాధపడ్డా. వాటిని పట్టించుకోకపోవడం మంచిదని భావించా. ఇప్పుడు ఎవరైనా కామెంట్‌ చేసినా లెక్కచేయను. నా కుమార్తె సుప్రితకూ ఇదే చెబుతుంటా’’ అని అన్నారు. సురేశ్‌ తేజ పలు సీరియల్స్‌కు దర్శకుడిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే సురేఖ వాణితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆయన్ను వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లు. పలు అనారోగ్య కారణాల వల్ల దాదాపు నాలుగేళ్ల క్రితం సురేశ్‌ తేజ మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని