Suriya: నేను తమిళనాడులోనే నివసిస్తున్నా: రూమర్స్‌పై స్పందించిన సూర్య

‘కంగువ’ సినిమాతో బిజీగా ఉన్న నటుడు సూర్య. ఇటీవల ఆయన ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధామిచ్చారు.

Published : 15 Aug 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుటుంబంతో కలిసి తాను ముంబయికి మకాం మార్చినట్లు వచ్చిన వార్తలపై కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య (Suriya) స్పందించారు. తన కూతురు, కొడుకు చదువుకునేందుకు ముంబయిలో ఉన్నారని తెలిపిన ఆయన తాను మాత్రం తమిళనాడులోనే నివసిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న సూర్యకు.. ముంబయి షిఫ్ట్‌ అయ్యారట?అనే ప్రశ్న ఎదురవగా క్లారిటీ ఇచ్చారు. జీవితంలో ఏదో కొత్తగా నేర్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా నటుడు మాధవన్‌తో కలిసి కొన్ని రోజులుగా గోల్ఫ్‌ ఆడుతున్నట్లు తెలిపారు. మంచి కొడుకుగా, మంచి నాన్నగా, మంచి భర్తగా ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

‘రోలెక్స్‌’పై మూవీ.. రంగం సిద్ధం: సూర్యe

మాధవన్‌ హీరోగా తెరకెక్కిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రంలో సూర్య అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా నిర్మాతగాను సూర్యకు మంచి అభిరుచి ఉంది. తన సతీమణి, జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ‘జై భీమ్‌’వంటి పలు హిట్‌ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కంగువ’ (Kanguva) చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో దర్శకుడు శివ ఈ సినిమా రూపొందిస్తున్నారు. వినూత్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో సందడి చేయనున్నారు. ఆయనకు జోడీగా దిశా పటానీ నటిస్తోంది. ఈ చిత్రం త్రీడీలో దాదాపు 10కి పైగా భాషల్లో వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు