Tammareddy: సినిమా వాళ్లు చీప్గా కనిపిస్తున్నారా? ముందు మీ సంగతి చూసుకోండి!
సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని, కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినిమా రంగమేనని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(tammareddy bharadwaj) అన్నారు.
హైదరాబాద్: సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని, కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినిమా రంగం మాత్రమేనని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (tammareddy bharadwaj) అన్నారు. సినీ పరిశ్రమపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించారు. బుధవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘పుష్ప’ తీసిన నిర్మాతలు ఒక కులానికి చెందినవారు కావటం వల్లే మరో కులానికి చెందిన వారిని సినిమాలో తిట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకు? గతంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డి తిన్నారని ఇప్పుడు మీరూ గడ్డి తింటున్నారా?మీకు ఒక సామాజిక వర్గం ఓట్లు వస్తే గెలవలేదు. అందరూ ఓట్లు వేశారు. సినిమా వాళ్లు చీప్గా దొరికారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?సినిమా కోసం వందల మంది కష్టపడతారు. కష్టపడితే వచ్చే ప్రాజెక్టు అది. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం. మీలాగా రూపాయి పెట్టి కోట్లు దోచుకు తినడం లేదు. మమ్మల్ని అనే ముందు మీ సంగతి మీరు చూసుకోండి. రాజకీయ నేతలు ఇంకెప్పుడూ బెదిరింపులకు పాల్పడవద్దు’’
‘‘ఆన్లైన్ టికెటింగ్ తీసుకొస్తే, ఏ రోజు లెక్కలు ఆరోజు తెలిసిపోతాయి. అందుకే అలా కావాలని చెప్పాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సరిగా అమలు చేస్తే చిత్ర పరిశ్రమకు లాభం చేకూరుతుంది. సాటి మనిషిని గౌరవించటం ముఖ్యం. దాసరి నారాయణరావు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నటుడు, నిర్మాత, ఎగ్జిబిటర్ ఇలా అనే అంశాలపైనా, వ్యక్తులపైనా పట్టు ఉంది. అన్ని విషయాలు తెలిసిన అలాంటి వ్యక్తి మరొకరు లేరు. చిరంజీవిగారు చొరవ తీసుకుని కొన్ని పనులు చేస్తున్నారు. అయితే, ఆయన పరిమితంగా ఉంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం దాసరి నారాయణరావులా సమయం వెచ్చించి పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. 24 గంటలూ ఆయన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్బాబులాంటి అగ్ర నటులతో పాటు, కొందరు దర్శకులు తమ పరిధి మేరకు చిత్ర పరిశ్రమకు ఏదో ఒకటి చేస్తున్నారు. ‘అవసరం వచ్చినప్పుడు ఉంటాను’ అని చిరంజీవి భరోసా ఇచ్చారు కదా! తప్పకుండా ఆ సమయానికి వస్తారు. చిన్న పంచాయతీలకు మాత్రం తాను రానని కరాఖండీగా చెప్పారు. ఏ ప్రభుత్వానికీ చిత్ర పరిశ్రమ వ్యతిరేకంగా ఉండదు. వ్యక్తిగతంగా అభిప్రాయభేదాలు ఉండవచ్చు. 30శాతం సినిమాలు ఆంధ్రప్రదేశ్లోనూ షూటింగ్ జరుపుకొంటున్నాయి. లాజిక్ తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు. మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావటానికి 30ఏళ్లు పట్టింది. ఏపీలో ఎక్కువ సినిమాలు షూటింగ్ జరగాలంటే ఇంకా సమయం పట్టవచ్చు. అక్కడ లొకేషన్లు అన్నీ ఫ్రీగా లభిస్తాయి. ఈ విషయమై చిరంజీవితో సహా పలువురు సినీ పెద్దలు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ రేట్లు చిన్న సినిమాలకు సరిపోతాయి. పెద్ద సినిమాలకు ఇబ్బంది అవుతుంది. మాట్లాడుకుని సరిచేసుకుంటే సరిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం చేసినట్లు టికెట్ ధరలను వర్గీకరించాలి. ఇదే విషయాన్ని ఛాంబర్ కూడా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. 99శాతం సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్