Rajamouli: ఛత్రపతి రీమేక్‌.. రాజమౌళి చీఫ్‌ గెస్ట్‌

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్‌తో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు తెలుగు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రీమేక్‌ బాధ్యతలను...

Updated : 16 Jul 2021 17:54 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్‌తో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు తెలుగు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రీమేక్‌ బాధ్యతలను వి.వి.వినాయక్‌ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా శ్రీనివాస్‌పై రాజమౌళి క్లాప్‌ కొట్టారు.

భారీ బడ్జెట్‌తో పెన్‌ స్టూడియోస్‌ ఈ రీమేక్‌ని నిర్మిస్తోంది. ‘ఛత్రపతి’ ఒరిజినల్‌ కథను రాసిన విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్‌కూ రచయితగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌ సరసన ఎవరు నటించనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. హీరోయిన్‌ పాత్ర కోసం అనన్యపాండే, కియారా అడ్వాణీ, కృతిసనన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘అల్లుడి శీను’తో వెండితెరకు పరిచయమైన శ్రీనివాస్‌ ఇప్పటివరకూ ఎనిమిది చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘అల్లుడు అదుర్స్‌’ అనంతరం ఆయన తెలుగులో ఏ ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని