అజరామరం ఆయన పాట..!
పాటలు అందరూ రాస్తారు.. కానీ, కథలోని సన్నివేశం, సందర్భం రక్తికట్టేలా పాటలు రాసేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. అలాంటి వాళ్లలో వెన్నెలకంటి
పాటలు అందరూ రాస్తారు.. కానీ, కథలోని సన్నివేశం, సందర్భం రక్తికట్టేలా పాటలు రాసేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. అలాంటి వాళ్లలో వెన్నెలకంటి ఒకరు. నేరుగా తెలుగు పాట రాయడం ఒకెత్తయితే, డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు రాయడం కత్తిమీద సాము. ఏమాత్రం తేడా ఉన్నా ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ కాలేడు. కానీ, వెన్నెలకంటి కలం పట్టుకుంటే అది ఏ భాష సినిమా అయినా, తెలుగువాడి గుండెకు హత్తుకునేలా సంభాషణలు, మాటలు ఉంటాయి. అంతటి ధారణశక్తి కలిగిన ఆయన మంగళవారం గుండెపోటుతో కన్నుమూసి, చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచారు. భౌతికంగా ఆయన మనల్ని విడిచి వెళ్లినా, ఆయన రాసిన పాటలు అజరామరం. అందుకే వెన్నెలకంటిని స్మరిస్తూ, ఆయన గురించి, ఆయన పాటల గురించి కొన్ని విషయాలు మీకోసం..
11వ ఏటే శతక రచన
వెన్నెలకంటి తన 11వ ఏటనే ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని రాశారు. అలా విద్యార్థి దశలో ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశారు. కానీ, తన మనసంతా నాటకాల మీద, సినిమాల మీదే ఉండేది. నాటకాలు వేస్తుండేవారు.అనంతరం కొన్ని సంవత్సరాలకు భారతీయ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేశారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారు. అదే ఆయన్ని సినీ గేయ రచయితగా నిలబెట్టింది.
నెల్లూరుకి మద్రాసు దగ్గర కావడంతో సరదాగా అక్కడకు వెళ్తుండేవారు. 1986లో నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో ‘‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల’’ పాట రాసే అవకాశమిచ్చారు. అదే తన తొలి సినీగీతం. 1987లో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘అన్నా చెల్లెలు’ సినిమాకి ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ పాట రాశారు. అలా నా పాటల ప్రయాణం మెల్లిగా ఊపందుకుంది. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం చేశారు.
అలరించిన ‘మాటరాని మౌనమిది’
‘మహర్షి’ (1988) సినిమాలో ‘‘మాటరాని మౌనమిది’’ పాట ప్రతి ఒక్కరినీ అలరించింది. ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి వంటి గొప్పవారి స్ఫూర్తితో స్రవంతి రవికిషోర్, వంశీ సూచన మేరకు ‘ముక్తపదగ్రస్థం’ వచ్చేట్టు ఒక పాట, మామూలు వర్షన్లో వచ్చేలా మరొక పాట రాశారు. ‘‘మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది’’ అనే పాట బాగా హిట్ అయింది. ‘‘ముత్యాల పాటల్లో కోయిలమ్మా.. ముద్దారబోసేది ఎప్పుడమ్మా.. ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా.. దీపాలు పెట్టేది ఎప్పుడమ్మా’’ చరణంతో నిర్మాత బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇళయరాజా అద్భుతంగా ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట హిట్ అవడంతో రవికిషోర్ తనకు ‘నాయకుడు’ డబ్బింగ్ వర్షన్లో రెండు పాటలు రాసే అవకాశాన్ని ప్రోత్సహించారు.
బాలు, చిత్ర పాడిన ‘‘చల్తీకా నామ్ గాడీ.. చలాకీ వన్నె లేడీ.. రంగేళి జోడీ.. బంగారు బాడీ.. వేగంలో చేసెను దాడీ.. వేడెక్కి ఆగెను ఓడి.. అహో.. ఇక ముప్పల తిప్పలు తప్పవా తప్పవా’’ అనే పాట సందర్భానికి రాసిన సరదా పాట. ఈ పాటలో హీరో ఒక డొక్కు కారును గురించి పొగడ్తలు చెప్పడమే ఉద్దేశం. ‘‘అశోకుడు యుద్ధంలోన వాడింది ఈ కారు.. శివాజీ గుర్రం వీడీ ఎక్కింది ఈ కారు’’ అంటూ చరణంలో పలికే ప్రగల్భాలు చెట్టుకింద ప్లీడరు సినిమాలో బాగా పండాయి. ఈ పాటనే స్ఫూర్తిగా తీసుకొని ఆరేళ్ల విరామం తరువాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో వంశీ ‘‘వెన్నెల్లో హాయ్.. హాయ్’’ పాటను చక్రి చేత ట్యూన్ చేయించుకున్నారు.
రెండో పాట ‘‘అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే.. మల్లెపూల చినుకై రావే.. పల్లవించి పలుకై రావే’’ అంటూ సాగే సాధారణ ప్రేమ గీతం. ఇందులో ‘‘జావళీలు పాడే జాణ.. జాబిలమ్మ తానై’’ అనే ప్రయోగం వంశీకి ఎంతో నచ్చింది. ఈ సినిమాలో మొదట సిరివెన్నెలతో ‘‘నిజమంటే నిప్పేకాదా.. ముట్టుకుంటే చుట్టుకోదా మంటా’’ అనే పాటను రాయించారు. ఈ పాట రికార్డు కూడా విడుదలైంది. వంశీ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అతనికి వైవిధ్యం కావాలి. ప్రాస కుదరాలి. ‘మంచీ-చెడు’ సినిమాలో ఆత్రేయ రాసిన ‘‘రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి.. నీ కంటి చూపుల వెంట నా పరుగంటి’’ పాటలా సాగిపోవాలి అంటూ వంశీ రెండు చరణాలకు రెండు సీన్లు ఇచ్చారు. పాట డైలాగుల్లా కాకుండా పాట రూపంలో ఆ రెండు సీన్లు రావాలి అని షరతుపెట్టి, పాట రాయమన్నారు. అన్నీ నిజాలే చెప్తే వచ్చే అనర్ధాలను పాట రూపంలో చెప్పారు. ‘‘మాటంటే మాటేనంట.. కంటబడ్డ నిజమంతా అంటా - రుజువంటూ దొరికిందంటే.. గంట కొట్టి చాటేస్తూ ఉంటా’’ అనే పల్లవిని రాజేంద్రప్రసాద్కు, ‘‘నిజమంటే తంటాలంటా.. నిక్కుతుంటే తిక్క దిగుతాదంటా.. మొదలంటూ చెడతావంట.. వెంటబడి తెగ తంతారంట’’ అనే పల్లవిని శోభనకు రాశారు. చూస్తున్నదే వింటున్నట్లు, వింటున్నదే చూస్తున్నట్లు రాయడంతో ఆ పాట బాగా పాపులర్ అయ్యింది.
పింగళి మళ్లీ కనిపించారు
సంగీత దర్శకుడు మాధవపెద్ది రమేష్ ‘‘షిర్డీ సాయి’’ ఆల్బమ్ కోసం వెన్నెలకంటితో నాలుగు పాటలు రాయించారు. ఆ పాటల సాహిత్యం విన్న సింగీతం శ్రీనివాసరావు ఆ పాటల్లో ‘ఆత్మ’ ఉంది అని మెచ్చుకున్నారట. అలా ఆయనకు ‘బృందావనం’ సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. 17 ఏళ్ల విరామం తరువాత విజయా వారు నిర్మించిన ఈ సినిమాకి పాటలు రాశారు. పింగళి, ఘంటసాల, పెండ్యాల కూర్చొని పాటలు రాసి మట్లు కట్టిన చారిత్రాత్మక గదిలో కూర్చొని పాటలు రాసినప్పుడు ఒళ్లు పులకించిందంటారు- వెన్నెలకంటి. ఈ పాటలకు స్వరాలు అల్లడానికి నలభై రోజులు పట్టింది. ముఖ్యంగా ‘‘మధురమే సుధా గానం.. మనకిదే మరో ప్రాణం.. మదిలో మోహన రాగం.. మెదిలే తొలి సంగీతం’’ పాట విజయా వారి ‘ట్రేడ్ మార్క్’ పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ‘‘ఓహో ఓహో బుల్లి పావురమా.. అయ్యో పాపం అంటే అది నేరమా.. అతివలకింత పంతమా.. అలకలు వారి సొంతమా’’ అంటూ బాలు, ‘‘పదే పదే వెటకారమా.. అతివలు అంత సులభమా.. శ్రుతి ఇంక మించనీకుమా’’ అని జానకి ఆలపిస్తారు. ఈ వరసలు విన్న రావి కొండలరావు, సింగీతం శ్రీనివాసరావు, బాబ్జీ ‘‘అబ్బా! మళ్లీ పింగళి గారు కనిపిస్తున్నారయ్యా’’ అంటూ మిస్సమ్మ సినిమాలో పింగళివారి ‘‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’’ పాటను గుర్తు చేసుకున్నారు. ‘అంతకు మించిన అవార్డు నాకేం కావాలి?’ అనే వారు వెన్నెలకంటి ‘‘ఆ రోజు నారాణి’’, ‘‘అబ్బో ఏమివింత’’, ‘‘మా మామయ్యా’’ పాటలు కూడా బాగా హిట్ అయినవే! సింగీతం దర్శకత్వం నిర్వహించిన ‘ఆదిత్య 369’లో వెన్నెలకంటి రాసిన ‘‘రాసలీల వేళ రాయబారమేలా.. మాటే మౌనమై మాయజేయ నేలా’’ పాటను సాధన చేసి రికార్డింగుకు సిద్ధమవుతూ బాలు, సింగీతంతో ‘‘ఈ పాట చాలా బాగా వచ్చిందండీ’’ అంటే... సింగీతం ‘‘నేను ఈ కుర్రాణ్ణి చెడగొడదామనుకున్నాను. అతను చెడిపోకపోగా చాలా అద్భుతంగా పాట రాశాడు. నాకు పింగళి గారితో రాయించుకున్న ఫీలింగు కలుగుతోంది’’ అన్నారట. అది అదే తనకు గొప్ప ప్రశంసా పత్రం అంటారాయన.
కళాతపస్వి విశ్వనాథ్ సినిమా ‘‘స్వాతికిరణం’’ సినిమాకు ‘‘కొండా కోనల్లో లోయల్లో.. గోదారి గంగమ్మా సాయల్లో.. కోరి కోరి కూసింది కోయిలమ్మ..’’ అని పల్లవి మొదలెట్టి ‘‘నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా.. రివ్వున గువ్వే సాగంగా.. నవ్వే మువ్వై మోగంగా.. ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా.. ఊపిరి ఊయలలూగంగా... రేపటి ఆశలు తీరంగా.. తెనుగుతనం నోరూరంగా... తేటగీతి గారాబంగా.. ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగా’’ అంటూ చరణాలు రాసుకెళ్ళారు. ‘‘అలతి పదాలతో ఎంత కమ్మగా పాట రాశావయ్యా’’ అని విశ్వనాథ్ మెచ్చుకుంటుంటే తన మేను రోమాంచితమైంది.. అది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి అంటారు- వెన్నెలకంటి
‘గజినీ’ సినిమాలో ‘‘హృదయం ఎక్కడున్నదీ.. నీ చుట్టూనే తిరుగుతున్నదీ’’ పాట రెండు సంవత్సరాలు మారు మోగిపోయింది. ‘బాషా’ సినిమాలో ‘‘నేను ఆటోవాణ్ణి, ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి - న్యాయమైన రేటు వాణ్ణి.. ఎదురులేని ఆటగాణ్ణి’’ అంటూ ‘‘మంచోళ్లకు మంచివాణ్ణి.. తప్పుడోళ్ల వేటగాణ్ణి.. అచ్చమైన తెలుగువాణ్ణి’’ అంటూ తెలుగుదనం నింపారు. ‘మహానది’లో ‘‘శ్రీరంగం రంగనాథుని దివ్య రూపమే చూడరే.. శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడరే - నీలవేణిలో నీటిముత్యాలు.. కృష్ణవేణిలో అలల గీతాలు’’ పాట వంటివి ఎన్నో మధురానుభూతులు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే?
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్