Radhe Shyam: విక్రమాదిత్యకు జ్యోతిష పరీక్ష.. నెగ్గాడిలా..!

ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe shyam). పూజా హెగ్డే కథానాయిక.

Published : 18 Apr 2022 19:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe shyam). పూజా హెగ్డే కథానాయిక. ప్రముఖ హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్‌, ప్రేరణగా పూజాహెగ్డే నటించి మెప్పించారు.  అందమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దినా, ప్రభాస్‌ సినిమా నుంచి ఆశించే కమర్షియల్‌ హంగులు లేకపోవడంతో అంచనాలను అందుకోలేకపోయింది.  ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో ఓ కీలక సన్నివేశాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ పంచుకుంది. విక్రమాదిత్య చెప్పే జోస్యం తప్పు అంటూ దాన్ని నిరూపించేందుకు డాక్టర్ల బృందం పరీక్ష పెడుతుంది. అందులో విక్రమాదిత్య నెగ్గుతాడు. ఆ ఆసక్తికర సన్నివేశాన్ని మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని