జమున నా అభిమాన నటి: పింగళి వెంకయ్య కుమార్తె!
అలనాటి సినీతార జమున వెండితెరపై కట్టు, బొట్టు ఎంత సంప్రదాయంగా ఉండేవో, అభినయం కూడా అంత అద్భుతంగా ఉంటుందని జాతీయ పతాక రూపకర్త
సింగపూర్: అలనాటి సినీతార జమున వెండితెరపై కట్టు, బొట్టుతో ఎంత సంప్రదాయంగా ఉంటారో, అభినయంతో కూడా అంత అద్భుతంగా ప్రేక్షకులను అలరించారని జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి అన్నారు. జమునా రమణారావు 85వ జన్మదినోత్సవం అంతర్జాలం వేదికగా ఘనంగా జరిగింది. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళా సమితి ఖతార్ కలిసి అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆన్లైన్లో సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ.. అప్పట్లో జమున సినిమా వస్తే తప్పకుండా చూసేవాళ్లమని, ఇప్పుడు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నిజంగా తన అదృష్టమని అన్నారు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికీ తమ కళ్ల ముందు ఆమె పోషించిన సత్యభామ పాత్రలాగానే ఆమె కనిపిస్తారని అన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి, కె.విశ్వనాథ్లకు జమున ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి (USA) జమునకు స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. వంశీ రామరాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబరులో జమునకు కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఈ వేడుక సందర్భంగా ప్రముఖ గాయని శారద ఆకునూరి మెగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాతాజీ ఉసిరికల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం దాదాపు 16 గంటల పాటు సాగింది. 30 దేశాల నుంచి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి.రమణ, మురళీమోహన్ , మండలి బుద్ధప్రసాద్, కె.ఐ.వరప్రసాద్రెడ్డి, డాక్టర్ ఏవీ గురవా రెడ్డి, ఉపేంద్ర చివుకుల (అమెరికా), డాక్టర్ ఎంఎస్ రెడ్డి (అమెరికా), శారద ఆకునూరి (అమెరికా),డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి (అమెరికా), తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మాధవపెద్ది సురేష్, భువనచంద్ర, డాక్టర్. కె.వి.కృష్ణ కుమారీ, దివ్యవాణి, తులసి, రోజా రమణి, డాక్టర్ చిట్టెం రాజు వంగూరి, లక్ష్మీ రాయవరపు (కెనడా), గుణసుందరి కొమ్మారెడ్డి (అమెరికా), లలితారాం (అమెరికా), కల్యాణి కొండూరు (ఖతార్) శైలజ సుంకరపల్లి, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శ్రీదేవి జాగర్లమూడి ( అమెరికా), శారద కాశివజ్జల ( అమెరికా), లయన్ లక్ష్మీప్రసాద్ కపటపు, సుధీర్ కోట (అమెరికా), రాజేష్ ఎక్కలి (అమెరికా) కె.ఎస్. ప్రసాద్ (ఖతార్), తాతాజీ ఉసిరికల (ఖతార్) రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రాధిక మంగిపూడి ( సింగపూర్), సురేష్ కొండేటి, జయ పీసపాటి (హాంకాంగ్), బి. కృష్ణ కుమార్ (ఖతార్), వి ఆర్ ఆర్ పద్మజ (ఖతార్), రాజేష్ తోలేటి (యూకే), జి వి ఎన్ నరసింహం , శ్రీలత మగతల (న్యూజిలాండ్), సారధి మోటమర్రి ( ఆస్ట్రేలియా), విజయ గొల్లపూడి ( ఆస్ట్రేలియా), డాక్టర్ వ్యాసకృష్ణ బూరుగుపల్లి (ఉగాండా), రాపోలు సీతారామరాజు ( సౌత్ ఆఫ్రికా), విక్రమ్ (సౌత్ ఆఫ్రికా), డాక్టర్ వెంకటపతి ( నార్వే), అనిల్ కుమార్ కడించెర్ల (ఒమాన్), హరి వేణుగోపాల్ (ఒమాన్), ఎం వి వి సత్యనారాయణ (ఖతార్),డి .సాయి సుబ్బారావు (కువైట్), వెంకటేశ్వరరావు (బోత్సువానా), సతీష్ (బోత్సువానా), పార్థసారథి (యుగాండా), సుందరగిరి శంకర గౌడ్ ( ఖతార్), రాధిక నోరి (అమెరికా), సత్యాదేవి మలుల్ల (మలేషియా), మరియు ఖతార్ తెలుగు కళాసమితి కార్యవర్గం పాల్గొన్నారు. శారద ఆకునూరి,కల్యాణి కొండూరు, సుజిత సైని, దుర్గా భవాని,గౌరీదేవి బొమ్మన, మాధవి బైటారు, వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని trinet లైవ్ టీవీ వారు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్ వర్క్షాప్
సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్ ఛాప్టర్ ‘తానా రిఫ్రెష్ వర్క్షాప్’ను నిర్వహించింది. -
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం