చికాగోలో ‘నాటా’ ఆత్మీయ సమావేశం
అమెరికాలోని చికాగోలో నాటా ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది.
చికాగో: అమెరికాలోని చికాగోలో ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. జూన్ చివరి వారంలో డల్లాస్ నగరంలో జరగనున్న నాటా కన్వెన్షన్కు ఆహ్వానిస్తూ ఆ సంఘం అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్రెడ్డి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. నాటా బోర్డు సభ్యుడు లింగారెడ్డిగారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి, మెట్టుపల్లె జయదేవరెడ్డి, కేకే రెడ్డి, హేమా కానూరి, రాంభూపాల్ రెడ్డి, శేషు రెడ్డి, కల్యాణ్ ఆనందుల, వెస్ట్మాంట్ ఇండియన్ అసోసియేషన్ నేతలు సృజన్, శివ, వెంకట్, శివారెడ్డి, నరసింహరావు, ఆది, శేషు, శ్రీకాంత్ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు రంగంలో విశిష్ఠ స్థానం సంపాదించుకున్నవారిని ఈ సభలకు ఆహ్వానించాలని, తెలుగు భాషా సంస్కృతికి పెద్ద పీట వేస్తున్న నాటా కార్యక్రమాలను జయప్రదం చేయాలని శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆతిథ్యం ఇచ్చిన వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు